News February 14, 2025
మర్రిగూడ: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సర్వేయర్

మర్రిగూడ తహశీల్దార్ కార్యాలయంపై శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. సరంపేట గ్రామానికి చెందిన ఓ రైతు ఎనిమిది గుంటల భూమి సర్వే విషయంపై సర్వేయర్ రవి నాయక్ను సంప్రదించగా.. అతడు రూ.15వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధిత రైతు ఏసీబీని ఆశ్రయించాడు. ఇవాళ మధ్యాహ్నం కార్యాలయంలో రవి రూ.12వేలు లంచం తీసుకుంటుండగా అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు.
Similar News
News January 10, 2026
రాష్ట్ర అండర్-17 ఫుట్బాల్ జట్టు కెప్టెన్గా నల్గొండ వాసి

అనుముల మండలంలోని హాలియా పట్టణానికి చెందిన చింతలచెరువు తేజు తెలంగాణ రాష్ట్ర అండర్-17 ఫుట్బాల్ జట్టు కెప్టెన్గా ఎంపికయ్యారు. ఈ నెల 12 నుంచి 16 వరకు హరియాణాలో జరిగే 69వ జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీల్లో ఆయన జట్టుకు నాయకత్వం వహించనున్నారు. గత నవంబర్లో నల్గొండలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచినందుకు గాను తేజుకు ఈ గౌరవం దక్కింది. జాతీయ స్థాయిలో రాణించాలని పలువురు ఆకాంక్షించారు.
News January 10, 2026
నల్గొండ: వేరే రాష్ట్రంలో దాక్కున్నా.. పోలీసులు వదల్లేదు

రెప్పపాటులో ప్రయాణికుల ఆభరణాలను మాయం చేసే అంతరాష్ట్ర ‘థార్’ ముఠా దొంగతనం ఉదంతాన్ని జిల్లా పోలీసులు ఛేదించారు. సాంకేతిక పరిజ్ఞానంతో 15రోజుల పాటు మధ్యప్రదేశ్లోని థార్ జిల్లాను జల్లెడ పట్టినCCS బృందం, ముఠా సభ్యుడైన షా అల్లా రఖాను అరెస్టు చేసింది. నిందితుడి వద్ద నుంచి రూ.85 లక్షల విలువైన 60 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు.
News January 10, 2026
నల్గొండ: నేటి నుంచి టీసీసీ పరీక్షలు

నల్గొండ జిల్లాలో టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. డ్రాయింగ్, టైలరింగ్ కోర్సుల కోసం జిల్లా కేంద్రంలో 8 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1550 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. ఈనెల 13 వరకు ప్రతిరోజూ రెండు సెషన్లలో (ఉదయం 10-1, మధ్యాహ్నం 2-5) పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.


