News February 14, 2025
నిర్మల్: ‘అలేఖ్య కేసులో మిగిలిన వారికి కూడా శిక్ష పడాలి’

అలేఖ్య కేసులో మిగిలిన వారికి కూడా శిక్ష పడాలని కోరుతూ బాధిత కుటుంబ సభ్యులు శుక్రవారం నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిలను వారి కార్యాలయంలో కలిసి విన్నవించారు. బాధితులు మాట్లాడుతూ.. అలేఖ్య హత్య కేసులో నిందితుడికి బుధవారం కోర్టు శిక్ష విధించిందని, అందుకు కారణమైన మిగతా ఇద్దరికీ శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్పీ స్పందిస్తూ హైకోర్టులో అపీలు చేస్తామని తెలిపారు.
Similar News
News November 9, 2025
SVUకు ర్యాగింగ్ మకిలి.. కొత్త అడ్మిషన్ల పరిస్థేంటి.?

గోరుచుట్టపై రోకలిబండలా SVU పరిస్థితి మారింది. ఓ <<18239778>>లెక్చరర్ తీరు<<>>తో అంతంత మాత్రంగా ఉన్న అడ్మిషన్లు మరింత దిగజారే ప్రమాదం నెలకొంది. SVUలో ఇటీవల PG అడ్మిషన్లు తగ్గుతున్నాయి. విద్యార్థులు లేకకొన్ని కోర్సులు మూసేశారు. లాంగ్వేజ్ కోర్సుల పరిస్థితి దయనీయం. ఇలాంటి తరుణంలో వర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేపింది. అరకొర అడ్మిషన్లతో నెట్టుకొస్తుంటే ఇలాంటి ఘటనల వల్ల విద్యార్థుల ఎలా చేరుతారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి
News November 9, 2025
బుల్లెట్, థార్ బండ్లను అస్సలు వదలం: హరియాణా డీజీపీ

థార్ నడిపే వ్యక్తులు రోడ్లపై విన్యాసాలు చేస్తారని హరియాణా DGP ఓపీ సింగ్ అన్నారు. ‘మేం అన్ని వాహనాలను తనిఖీ చేయం. కానీ బుల్లెట్ బైక్, థార్ కార్లను అస్సలు వదలం. మీరు ఎంచుకునే వాహనాలే మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. థార్ స్టేటస్ సింబల్ అయింది. ఇటీవల ఓ ACP కొడుకు థార్ నడిపి ఒకరిని ఢీకొట్టాడు. తన కుమారుడిని రక్షించాలని అధికారి వేడుకున్నాడు. కారు అతడి పేరు మీదే ఉంది. అతడొక మోసగాడు’ అని చెప్పారు.
News November 9, 2025
సంగారెడ్డి: శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులు

కార్తీక మాసాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి ఆర్టీసీ డిపో నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ ఉపేందర్ తెలిపారు. నేటి నుంచి మొత్తం 4 సూపర్ లగ్జరీ బస్సు సర్వీసులను నడపనున్నట్లు ఆయన వివరించారు. ఈ బస్సులు ఉదయం 4:10, 5:50 గంటలకు, మధ్యాహ్నం 1, 2 గంటలకు డిపో నుంచి బయలుదేరుతాయని తెలిపారు. భక్తులు ఈ ప్రత్యేక సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.


