News February 14, 2025
సంగారెడ్డి: విద్యాశాఖ కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్ష

విద్యాశాఖ కార్యక్రమాలపై కలెక్టర్ వల్లూరి క్రాంతి శుక్రవారం జిల్లాలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, జిల్లా అధికారులతో ఎంఈఓలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాలకు విడుదలైన నిధులపై సమీక్షించి అందరూ ప్రధానోపాధ్యాయులు ఆ నిధులను వంద శాతం ఖర్చు చేయాలని, మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని సూచించారు.
Similar News
News September 18, 2025
సభా సమయం.. జిల్లా నేతల సంసిద్ధం!

నేటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. ఇప్పటికే నేతలంతా విజయవాడకు చేరుకున్నారు. జిల్లాలో రోడ్లు, ప్రాజెక్టుల నిర్మాణం వంటి అంశాలపై గళమెత్తనున్నారు. కొడికొండ వద్ద 23 వేల ఎకరాల్లో పారిశ్రామిక పార్కు ఏర్పాటుపై చర్చించే అవకాశముంది. మరోవైపు YCP నాయకులు అసెంబ్లీకి వస్తే ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని మంత్రి సవిత ప్రకటించారు.
News September 18, 2025
గుంటూరులో అతిసార కేసులపై కలెక్టర్ సమీక్ష

గుంటూరులో డయేరియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా వైద్య అధికారులను అప్రమత్తం చేశారు. కేసులపై తక్షణమే నివేదిక సమర్పించాలని, వ్యాధి విస్తరించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు భయపడకుండా అవగాహన కల్పించాలని, ఆసుపత్రుల్లో చేరిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఇంటింటి సర్వే చేసి, పరిశుభ్రమైన తాగునీటిని అందించాలని అధికారులను ఆదేశించారు.
News September 18, 2025
మత్స్యకార కుటుంబాలకు పరిహారం: ఎంపీ తంగెళ్ల

చేపల వేటకు వెళ్లి మరణించిన మత్స్యకార కుటుంబాలకు పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. బుధవారం కాకినాడలో ఆయన మాట్లాడారు. ఏడేళ్లలో జిల్లాలో 18 మంది మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణించారని చెప్పారు. గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా వారికి తక్షణమే పరిహారం విడుదల చేయాలని అధికారులను కోరారు.