News February 14, 2025

నేలకొండపల్లి: అప్పుల బాధతో రైతు బలవన్మరణం

image

అప్పుల బాధ భరించలేక ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని మంగాపురం తండాలో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తేజావత్ రామ(50) తనకున్న నాలుగు ఎకరాలకు తోడు మరికొంత కౌలుకి తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. పంట పెట్టుబడికి అప్పు చేశాడు.. ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడంతో, అప్పు తీర్చే మార్గం లేక ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు.

Similar News

News September 14, 2025

పులివెందుల మెడికల్ కాలేజీపై మీ మాటేంటి?

image

పులివెందులలో మెడికల్ కాలేజీపై కూటమి, వైసీపీ నేతల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. పులివెందులలో మెడికల్ కాలేజీ పూర్తి చేయలేదని MLC రాంగోపాల్ రెడ్డి ఆరోపించారు. NMC కాలేజీని పరిశీలించిన తర్వాతేగా 50 సీట్లు కేటాయించింది. అంటే NMC కళ్లు మూసుకుని సీట్లు కేటాయించిందా అని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. పులివెందుల మెడికల్ కాలేజీపై కూటమి నేతలు చేస్తున్నది అవాస్తవమని మాజీ ఎంపీ తులసిరెడ్డి ధ్వజమెత్తారు.

News September 14, 2025

మచిలీపట్నంలో కేజీ చికెన్ ధర ఎంతంటే.?

image

మచిలీపట్నంలో ఆదివారం చికెన్, మటన్ ధరలు ఇలా ఉన్నాయి. పట్టణంలో చికెన్ విత్ స్కిన్ కిలో రూ.220, స్కిన్‌లెస్ కిలో రూ.240కు విక్రయాలు జరుగుతున్నాయి. అదే ధరలు గ్రామాల్లో ఎక్కువగా ఉండి స్కిన్ ఉన్న చికెన్ కిలో రూ.240, స్కిన్‌లెస్ రూ.260కు అమ్ముతున్నారు. మటన్ కిలో రూ.1000గా ఉండగా, గ్రామాల్లో మాత్రం కిలో రూ.800కి విక్రయాలు జరుగుతున్నాయి.

News September 14, 2025

GWL: సైబర్ క్రైమ్ బాధితులకు రిఫండ్ ఆర్డర్ కాపీలు

image

గద్వాల జిల్లాలో నమోదైన సైబర్ క్రైమ్ కేసులను సైబర్ క్రైమ్ పోలీసులు చేదించారు. 61 మంది బాధితులకు సంబంధించి రూ.17,26,363 ఫ్రీజ్ చేయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. శనివారం గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశం మేరకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో బాధితులకు రిఫండ్ ఆర్డర్ కాపీలు అందజేశారు. దీంతో వారు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.