News February 14, 2025
సమ్మక్క, సారలమ్మను దర్శించుకున్న ఎస్పీ

ములుగు జిల్లా ఎస్పీ శబరీష్, డీఎస్పీ రవీందర్, క్రైమ్ బ్రాంచ్ డీఎస్పీ కిషోర్ కుమార్, సీఐలు శంకర్, రవీందర్ వన దేవతలను దర్శించుకున్నారు. పూజారులు, ఎండోమెంట్ అధికారులు డోలు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. వనదేవతలకు ఇష్టమైన పసుపు, కుంకుమ, చీరే సారె సమర్పించి ప్రత్యేక మొక్కులు చెల్లించారు. ఎస్పీతో పోలీస్ అధికారులను పూజారులు, ఎండోమెంట్ అధికారులు శాలువాతో సన్మానించి అమ్మవారి ప్రసాదం అందించారు.
Similar News
News October 18, 2025
ఎలమంచిలి: ఎంపీపీ మీద అవిశ్వాస తీర్మానంపై సమావేశం

ఎలమంచిలి ఎంపీపీ బి. గోవిందుపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు గత నెల 24న నలుగురు సభ్యులు నోటీసు ఇచ్చిన నేపథ్యంలో శనివారం సాయంత్రం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనకాపల్లి ఆర్డీవో షేక్ ఆయిషా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. సమావేశానికి నోటీసు ఇచ్చిన జనసేన ఎంపీటీసీలు బి. శివలక్ష్మి, నగిరెడ్డి అమ్మాజీ, రాజన శేషు, ఎస్. ఉమా హాజరయ్యారు. కొద్దిసేపట్లో ఈ విషయం తేలనుంది.
News October 18, 2025
ఖమ్మం: బందోబస్త్ను పరిశీలించిన పోలీస్ కమిషనర్

బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర బీసీ జేఏసీ శనివారం బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను పరిశీంచారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సామాన్య ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు. ప్రశాంత వాతావరణానికి భంగం కలగకుండా పోలీస్ సిబ్బంది, నిఘా బృందాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.
News October 18, 2025
RTC బస్సులు స్టార్ట్ అయ్యాయ్!

తెలంగాణలో బంద్ ప్రభావం తగ్గడంతో ఆర్టీసీ బస్సులు డిపోల నుంచి బయటకు వస్తున్నాయి. హైదరాబాద్లో పలు ఎలక్ట్రిక్ బస్సులు తిరిగి ప్రారంభమయ్యాయి. జిల్లాల్లో 2,600 బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. ఉదయం నుంచే వివిధ బీసీ సంఘాలు, రాజకీయ నేతలు డిపోల ఎదుట బైఠాయించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరి మీ ప్రాంతంలో బంద్ ప్రభావం ఎలా ఉందో కామెంట్ చేయండి.