News March 20, 2024
HYD: కొత్త గవర్నర్ను సత్కరించిన హర్యానా గవర్నర్, సీఎం

HYD రాజ్భవన్లో తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్గా బుధవారం బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సీపీ రాధాకృష్ణన్ను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేసి సత్కరించారు. అనంతరం శుభాకాంక్షలు తెలిపారు. కాగా రాధాకృష్ణన్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా అదనపు బాధ్యతలు నిర్వహించనున్న విషయం తెలిసిందే.
Similar News
News October 26, 2025
రంగారెడ్డి: రేపు ‘లక్కీ’గా వైన్స్ దక్కేదెవరికి?

మద్యం షాపుల టెండర్లకు TG ఎక్సైజ్ శాఖ అధికారులు రేపు లక్కీ డ్రా తీయనున్నారు. రంగారెడ్డి జిల్లా సరూర్నగర్ యూనిట్లో 138 లిక్కర్ షాపులకు 7,761 దరఖాస్తులు వచ్చాయి. శంషాబాద్లో 111 షాపులకు 8,306 మంది దరఖాస్తు చేశారు. ప్రభుత్వానికి జిల్లా నుంచి రూ.482.01 కోట్ల ఆదాయం సమకూరింది. గ్రేటర్ పరిధిలోని 639 షాపులకు 34,958 దరఖాస్తులు రాగా.. రూ.1048.74 కోట్ల ఆదాయం రావడం విశేషం.
News October 21, 2025
ఈనెల 25తో ముగియనున్న సర్వే: రంగారెడ్డి కలెక్టర్

తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ రూపకల్పన కోసం ఉద్దేశించిన “తెలంగాణ రైజింగ్ – 2047” సిటిజన్ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని RR జిల్లా కలెక్టర్ C.నారాయణ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు ఈ సిటిజన్ సర్వేలో కేవలం తెలంగాణ పౌరులు పాల్గొని తమ విలువైన సమాచారాన్ని అందజేశారన్నారు. దేశ స్వాతంత్య్రానికి 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలో ప్రజలు సలహాలు ఇవ్వాలన్నారు.
News October 21, 2025
HYD: సెల్యూట్.. వీరులారా మీకు వందనం!

తెలంగాణ పోలీస్ శాఖ ఉలిక్కిపడిన ఘటన ఇది. మావోలు ఏకంగా పోలీస్ స్టేషన్ను పేల్చేశారు. ఇది జరిగి 28 ఏళ్లు గుడుస్తున్నా నేటికి అమరులైన పోలీసులే యాదికొస్తుండ్రు. 1997లో యాచారం PSలో జమీల్ అహ్మద్, రాజేశ్వర్ రావు కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. పథకం ప్రకారం మావోలు స్టేషన్ను పేల్చివేయడంతో విధి నిర్వహణలోనే ప్రాణాలు విడిచారు. పోలీస్ సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసు అమరులకు నివాళి అర్పిద్దాం.


