News February 15, 2025

కోస్గి: రహదారి విస్తరణ పనులపై సమావేశం

image

కోస్గి పట్టణంలో జరుగుతున్న రహదారి విస్తరణ పనులపై శుక్రవారం నారాయణపేట కలెక్టరేట్ మీటింగ్ హాలులో అధికారులు, ప్రధాన రహదారి వెంబడి ఇల్లు కోల్పోతున్న వారితో కలెక్టర్ సిక్తా పట్నాయక్ సమావేశం నిర్వహించారు. రహదారి నిర్మాణంలో ఆస్తి నష్టం తక్కువగా ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. 165 మంది బాధితులు ప్రభుత్వం అందించే నష్టపరిహారం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని అధికారులు వివరించారు.

Similar News

News November 1, 2025

కారంచేడు: మరణంలోనూ వీడని బంధం

image

కష్టసుఖాలలో ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ మరణంలో కూడా ఒకరికొకరు తోడుగా ఉన్నారు ఆ దంపతులు. కారంచేడు(M) ఆదిపూడికి చెందిన పగడాల సుబ్బారావు(80), సుబ్బులు(70) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సుబ్బారావు గురువారం తీవ్ర అస్వస్థతకు గురికాగా గుంటూరు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. భార్య మంచంలోనే ఉంది. శుక్రవారం భర్త చనిపోయాడని తెలియడంతో కొన్ని గంటల్లోనే సుబ్బులు కూడా మరణించింది. నిన్న అంత్యక్రియలు నిర్వహించారు.

News November 1, 2025

భారత్ ఓటమి.. గంభీర్‌పై విమర్శలు

image

AUS టూర్‌లో భారత పేలవ ప్రదర్శన పట్ల కోచ్ గంభీర్‌పై విమర్శలు వస్తున్నాయి. నిన్నటి మ్యాచులోనూ టాప్ వికెట్ టేకర్ అర్ష్‌దీప్‌ను తీసుకోకపోవడం ఆశ్చర్యానికి గురి చేసిందని AUS మాజీ ఓపెనర్ ఫించ్ అన్నారు. అర్ష్‌దీప్‌ను పక్కన పెట్టడంపై అశ్విన్ సైతం అసహనం వ్యక్తం చేశారు. అయితే అతడి ప్లేస్‌లో వచ్చిన హర్షిత్ నిన్న బ్యాటుతో రాణించాడని, గంభీర్ నిర్ణయం సరైనదేనని ఆయన ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. దీనిపై మీరేమంటారు?

News November 1, 2025

సూర్యాపేట: మోజు తీరిన తర్వాత ముఖం చాటేశాడు!

image

మహిళను ఓ యువకుడు మోసం చేయగా కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు.. సూర్యాపేటకు చెందిన డిగ్రీ విద్యార్థి రమేశ్(20)కు 2022లో బంజారాహిల్స్ ఇందిరానగర్‌లో నివసించే ఓ మహిళ(32) ఇన్‌స్టాలో పరిచయమైంది. ఆమెకు ఒక కూతురు ఉండగా భర్త చనిపోయాడు. ఈవిషయాన్ని ఆమె రమేశ్‌కు చెప్పింది. దీంతో తాను పెళ్లి చేసుకుని, తల్లీబిడ్డను బాగా చూసుకుంటానని నమ్మించాడు. మోజు తీరిన తర్వాత ముఖం చాటేయగా ఆమె PSలో ఫిర్యాదు చేసింది.