News March 20, 2024
ఆదోని: రైలు పట్టాలపై మృతదేహం లభ్యం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1710928480585-normal-WIFI.webp)
ఆస్పరి-మొలగవల్లి ఆర్ఎస్ఎల్ఏ మధ్య కెఎం నెంబర్ 470/28 రైలు పట్టాల పక్కన గుర్తుతెలియని మగ మృతదేహం లభ్యమైనట్లు రైల్వే ఎస్సై గోపాల్ తెలిపారు. సుమారు 35 ఏళ్ల వయసు ఉంటుందని, 3 రోజుల క్రితం రైలు నుంచి జారి పడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెంది ఉంటాడని పోలీసుల అనుమానిస్తున్నారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉందని, గుర్తుపట్టలేని స్థితిలో ఉందని అన్నారు.
Similar News
News July 8, 2024
భక్తుల రద్దీకి అనుగుణంగా శ్రావణమాసం ఏర్పాట్లు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720423745279-normal-WIFI.webp)
శ్రీశైలం ఆలయానికి శ్రావణమాసంలో వచ్చే భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆలయ ఈవో పెద్దిరాజు ఆదేశించారు. శ్రావణమాసం ఏర్పాట్లలో భాగంగా సోమవారం ఆలయ సిబ్బందితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి వారికి శ్రావణమాసంలో ప్రత్యేక పూజలు ఉంటాయన్నారు. భక్తులకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు.
News July 8, 2024
శ్రీశైలంలో ఉద్యోగుల విధుల్లో మార్పులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720422801804-normal-WIFI.webp)
పరిపాలన సౌలభ్యంలో భాగంగా శ్రీశైలం దేవస్థానంలో వివిధ కీలక విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల స్థానాలను మారుస్తూ ఈవో పెద్దిరాజు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా ఆలయంలోని పలు విభాగాల్లో పనిచేస్తున్న 50మంది రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల అంతర్గత బదిలీలు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈవో పెద్దిరాజు మాట్లాడుతూ.. ఎవరికి కేటాయించిన స్థానాల్లో వారు విధులు పకడ్బందీగా నిర్వహించాలన్నారు.
News July 8, 2024
ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలి: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720418615894-normal-WIFI.webp)
ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు తగిన ప్రాధాన్యతనిస్తూ ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. నంద్యాల జిల్లా కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను జిల్లా కలెక్టర్కు అర్జీల రూపంలో అందించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కలెక్టర్ తెలిపారు.