News February 15, 2025

చల్పాకలో సమ్మక్కకు పూజలు నిర్వహిస్తున్న భక్తులు

image

ఏటూరునాగారం మండలం బానాజీ బంధం (చల్పాక)లో ఆలం వంశీయులు (తలపతులు), కోరం వంశీయులు (వడ్డేలు) ఆధ్వర్యంలో సమ్మక్క జాతర ఘనంగా జరుగుతోంది. గురువారం రాత్రి దేవుని గుట్ట నుండి సమ్మక్క రూపంలో తీసుకొచ్చిన కుంకుమ భరణిని ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించి సమ్మక్క గద్దె పైకి తెచ్చి ప్రతిష్ఠించారు. సమ్మక్కను దర్శించుకోవడానికి శుక్రవారం భక్తులు భారీగా తరలివస్తున్నారు. శనివారంతో ఈ జాతర ముగియనుంది.

Similar News

News March 1, 2026

రేపు కలెక్టరేట్‌లో PGRS కార్యక్రమం

image

ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS)ను ఈ సోమవారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను అధికారిక వెబ్‌సైట్ Meekosam.ap.gov.in ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు. ఇతర వివరాలకు సంబంధించి సమాచారం కోసం నేరుగా 1100 కాల్ సెంటర్‌ను సంప్రదించవచ్చన్నారు.

News March 1, 2026

రామన్నపేట: డిగ్రీ పూర్తి చేయలేకపోయారా.. ఇది మీకోసమే

image

డిగ్రీ పూర్తి చేయలేకపోయిన వారికి MGU సువర్ణావకాశం కల్పించింది. రామన్నపేట డిగ్రీ కాలేజీలో 2010–11 నుంచి నేటి వరకు పాత(ఇయర్/సెమిస్టర్), నూతన విధానం(సెమిస్టర్)లో డిగ్రీ సకాలంలో పూర్తి చేయలేకపోయిన వారికి అవకాశం కల్పిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రొ.డా.రాహత్ ఖానం, అకాడమిక్ కోఆర్డినేటర్ డా.J.చిన్నబాబు తెలిపారు. పరీక్ష ఫీజు చెల్లించడానికి MAR 4 చివరి తేదీ అని, బ్యాక్‌లాగ్ ఉన్నవారు ముందుకు రావాలని కోరారు.

News March 1, 2026

ఖమేనీ అంతం… US తదుపరి అడుగులు ఏమిటి

image

ఇరాన్ ‘సుప్రీం’ ఖమేనీని అంతం చేసిన US అక్కడి ప్రభుత్వ మార్పుపై ఏం చేయబోతుందనేది ఆసక్తిగా మారుతోంది. ఇరాక్‌లో సద్దాం అంతం అనంతరం ప్రజా ప్రభుత్వం ఏర్పాటైనా US అండతోనే పాలన సాగింది. వెనిజులాలో అధ్యక్షుడు మదురోను అరెస్టు చేసినా అక్కడి ప్రభుత్వాన్నే కొనసాగించింది. అయితే ఇరాన్‌లో అలా సాధ్యం కాదని, భిన్నమైన వ్యూహంతో వెళ్లొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్గత కలహాలతో GOVT కూలిపోవచ్చంటున్నారు.