News February 15, 2025

విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలి: కలెక్టర్

image

అనకాపల్లి జిల్లాలో పదవ తరగతి, ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా బస్సు సౌకర్యం కల్పించాలన్నారు.

Similar News

News July 5, 2025

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

image

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతుంది. గువ నుంచి వరద వచ్చి చేరడంతో కొత్తనీటితో ప్రవాహం సాగుతోంది. శనివారం ఉదయం 19.6 అడుగులకు చేరింది. కాగా భద్రాచలం వద్ద వరద ప్రవాహం 43 అడుగులకు చేరుకుంటే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.

News July 5, 2025

WOW.. అంతరిక్షం నుంచి మెరుపు ఎలా ఉందో చూడండి

image

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తీసిన మెరుపు ఫొటో నెటిజన్లను మైమరిపిస్తోంది. దీనిని స్ప్రైట్ అని పిలుస్తారని నిపుణులు చెబుతున్నారు. ఇది సాధారణ మెరుపులా కాకుండా జెల్లీ ఫిష్ ఆకారపు పేలుళ్లు లేదా స్తంభంలా కనిపిస్తుందని పేర్కొన్నారు. ‘జస్ట్ వావ్. మేము ఈ ఉదయం మెక్సికో & యూఎస్ మీదుగా వెళ్లినప్పుడు, నేను ఈ స్ప్రైట్‌ను బంధించా’ అని వ్యోమగామి నికోల్ SMలో ఈ చిత్రాన్ని పంచుకోగా వైరలవుతోంది.

News July 5, 2025

పవన్ రాకతో.. జిల్లా జనసేన ఆల్ సెట్.!

image

ప్రకాశం జిల్లాలో జనసేన సెట్ అయినట్లేనన్న టాక్ నడుస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ రాకతో జనసేన బలోపేతంపై క్యాడర్ దృష్టిసారించనున్నట్లు ప్రచారం సాగుతోంది. విభేదాలు వీడి ఒకే తాటిపైకి రావాలని మార్కాపురం పర్యటన సందర్భంగా వన్ నాయకులకు సూచించినట్లు సమాచారం. దీనితో జిల్లాలో క్యాడర్ ఒకే తాటిపైకి వచ్చి పార్టీపై దృష్టి సారించే పరిస్థితి ఉందట. చివరికి పవన్.. జిల్లాలో ఆల్ సెట్ చేసినట్లేనని టాక్ వినిపిస్తోంది.