News February 15, 2025
సంగారెడ్డి: పదవ తరగతిలో 100% ఫలితాలు సాధించాలి: కలెక్టట్

పదో తరగతిలో 100% ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం నుంచి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అందరికి పాఠశాలలో దత్తత తీసుకున్న అధికారులు పర్యవేక్షించాలని చెప్పారు. విద్యార్థులు 10 జీపీఏ సాధించేలా కృషి చేయాలని పేర్కొన్నారు.
Similar News
News November 17, 2025
మధ్యాహ్న భోజనం పథకం నాణ్యతలో రాజీ పడొద్దు: కలెక్టర్

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం నాణ్యతలో రాజీ పడకుండా సక్రమంగా అమలు చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి స్టీరింగ్ కమ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. మధ్యాహ్నం భోజనం పథకం అమలు తీరుపై కమిటీ సభ్యులతో కలెక్టర్ సమీక్షించారు. పథకం అమలులో లోటుపాట్లపై ఆరా తీశారు.
News November 17, 2025
జనగామ: విషాదం.. యువకుడి ఆత్మహత్య

గడ్డిమందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామ జిల్లా తరిగొప్పుల మండలం నర్సాపూర్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన పల్లె సంజయ్(19) ఆదివారం గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో వరంగల్ MGM ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. ప్రేమ విఫలమే సూసైడ్కు కారణమని స్థానికులు చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 17, 2025
మధ్యాహ్న భోజనం పథకం నాణ్యతలో రాజీ పడొద్దు: కలెక్టర్

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం నాణ్యతలో రాజీ పడకుండా సక్రమంగా అమలు చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి స్టీరింగ్ కమ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. మధ్యాహ్నం భోజనం పథకం అమలు తీరుపై కమిటీ సభ్యులతో కలెక్టర్ సమీక్షించారు. పథకం అమలులో లోటుపాట్లపై ఆరా తీశారు.


