News February 15, 2025

ములుగు: నేడు డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు

image

2008 డీఎస్సీలో అర్హత సాధించిన ఎస్‌జీటీ అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు వారిని కాంట్రాక్ట్ టీచర్లుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు HNK డీఈవో కార్యాలయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేశారు.ఉమ్మడి జిల్లాలో 295 మంది అభ్యర్థులకు గాను 182 మంది అభ్యర్థులు వెరిఫికేషన్‌కు హాజరయ్యారు.నేడు ములుగు జిల్లాకు చెందిన 28 మందికి నియామకపత్రాలు అందజేయనున్నారు. వీరికి నెలకు రూ.31,040 జీతం ఇవ్వనున్నారు.

Similar News

News November 11, 2025

ఈ నెల 13 నుంచి అగ్రికల్చర్​ కోర్సు అడ్మిషన్లకు కౌన్సెలింగ్​

image

TG: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, అనుబంధ కాలేజీల్లో BSC ఆనర్స్​, అగ్రికల్చర్​ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 13 నుంచి కౌన్సెలింగ్​ నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు HYD రాజేంద్రనగర్‌లోని యూనివర్సిటీలో కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని అధికారులు సూచించారు. అన్ని సర్టిఫికెట్స్ ఒరిజినల్, జిరాక్స్ కాపీలు తీసుకురావాలని చెప్పారు. సైట్: www.pjtau.edu.in/

News November 11, 2025

MHBD జిల్లాలో మండల పరిషత్తులకు సూపరింటెండెంట్ల నియామకం

image

మహబూబాబాద్ జిల్లాలో పలు మండల పరిషత్‌లకు సూపరింటెండెంట్లను నియమిస్తూ జడ్పీ సీఈవో మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.. తొర్రూరు- డి.రాజేశ్వరి, పెద్దవంగర-మహేందర్ రెడ్డి, దంతాలపల్లి-సిద్ది శ్రీనివాస్, నర్సింహులపేట-రేణుకాదేవి, కేసముద్రం-సీహెచ్ శ్రీనివాస్, కురవి-నాగమల్లేశ్వరరావు, మహబూబాబాద్-వీరభద్రరావు, చిన్నగూడూరు-శైలజ, కొత్తగూడ- జయ, గంగారం-కృష్ణ, గూడూరు పృథ్వీరాజ్‌ను కేటాయించారు.

News November 11, 2025

రెవెన్యూ సదస్సు దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్

image

రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తహశీల్దార్లు, ఆర్డీవోలను ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ప్రతి మండలంలో రోజుకు కనీసం 50 దరఖాస్తులను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సాదాబైనామా దరఖాస్తులను కూడా వేగంగా పరిష్కరించాలన్నారు. అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, ఆర్డీవోలు రాథోడ్ రమేష్ ఉన్నారు.