News February 15, 2025
అనకాపల్లి: నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

ఓ వ్యక్తి ఆత్మహత్యకు కారకుడైన నిందితుడిని శుక్రవారం అరెస్టు చేసినట్లు అనకాపల్లి పట్టణ ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. అనకాపల్లి పట్టణానికి చెందిన ఎస్.పైడిశెట్టి దస్తావేజుల కోసం ఒత్తిడి చేయడంతో డి.వెంకట సత్యనారాయణ ఈనెల 11వ తేదీన పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య జయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News March 13, 2025
రోజూ చికెన్ తింటున్నారా?

చికెన్ అంటే ఇష్టపడని నాన్ వెజ్ ప్రియులు ఉండరు. అయితే రోజూ చికెన్ తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. ప్రతి రోజూ తింటే శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగి ఎముకలు, కీళ్ల సమస్యలు వస్తాయంటున్నారు. గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కిడ్నీ సమస్యలతో బాధపడేవారు చికెన్కు దూరంగా ఉండటమే మేలని సూచిస్తున్నారు.
News March 13, 2025
గ్రూప్-1లో సత్తాచాటిన పెగడపల్లి మండల వాసి

పెగడపల్లి మండలం బతికేపల్లికి చెందిన గాలిపెల్లి రాజమౌళి- అనూష కుమార్తె గాలిపెల్లి స్నేహ ఇటీవల వెలువడిన గ్రూప్-1 ఫలితాల్లో 517 మార్కులతో రాష్ట్రస్థాయి 485వ ర్యాంకు సాధించింది. ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తూ గ్రూప్-1కు ప్రిపేరై మొదటి ప్రయత్నంలోనే ఈ ర్యాంక్ సాధించడం పట్ల ఆమెను పలువురు అభినందించారు. ఆమె తండ్రి స్వర్ణకార వృత్తి చేస్తుండగా తల్లి కుట్టు మిషన్ కుడుతుంది.
News March 13, 2025
పెబ్బేరు: దరఖాస్తు గడువు పెంపు: నరేష్ కుమార్

పెబ్బేరు ఆదర్శ పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి 6 నుంచి 10వ తరగతి ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసేందుకు తుది గడువు ఈనెల 20 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ నరేష్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇక్కడ విద్యార్థులు ప్రవేశాలు పొందితే ఇంటర్ వరకు నాణ్యమైన విద్య ఉచితంగా లభిస్తుందన్నారు.