News February 15, 2025
NGKL: ఈ నెల 19వ తేదీ నుంచి 24 గంటలూ అనుమతి

నాగర్ కర్నూల్ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీశైల క్షేత్రానికి ఈ నెల 19వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు అటవీ శాఖ చెక్ పోస్టులో 24 గంటలూ అనుమతి ఉంటుందని శ్రీశైలం సబ్ DFO అబ్దుల్ రవూఫ్ పేర్కొన్నారు. సాధారణ రోజుల్లో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 వరకు శ్రీశైలానికి రోడ్డు మార్గంలో ప్రయాణికులను, వాహనాలను అనుమతించరు. పాదయాత్రగా వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.
Similar News
News November 8, 2025
దుగ్గిరాల: అప్పు ఇప్పించలేదని అంతమొందించారు..!

అప్పు ఇప్పించలేదన్న కోపంతో దుగ్గిరాల యాదవపాలెంలో నీలాపు వీరబాబు (37)ను దారుణంగా హత్య చేశారు. చికెన్ వ్యాపారి నవీన్, వీరబాబు మధ్య డబ్బు విషయమై గొడవ జరిగింది. మనసులో పెట్టుకున్న నవీన్, బంధువు కృష్ణతో కలిసి శుక్రవారం సాయంత్రం వీరబాబు తల్లి కళ్లముందే కత్తితో గొంతు కోయించాడు. ఈ ఘటనపై ఎస్ఐ రవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 8, 2025
విశాఖపై దక్షిణాఫ్రికా క్రికెట్ కామెంటేటర్ భావోద్వేగ ట్వీట్

దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత కాస్ నాయుడు (Kass Naidoo) విశాఖతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. #CWC25 సందర్భంగా విశాఖ వచ్చిన ఆమె భావోద్వేగంగా స్పందించారు. తన తాత అనకాపల్లిలో పుట్టారని.. 57 ఏళ్ల క్రితం తన అమ్మ కూడా విశాఖలోనే ఉండేవారని గుర్తు చేసుకున్నారు. భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్ను క్రీడా రంగంలోని ఉత్తములతో కలిసి వ్యాఖ్యానం చేయడం ఎప్పటికీ గుర్తుండిపోతుందంటూ ట్వీట్ చేశారు.
News November 8, 2025
దేశంలోనే మొదటి పురోహితురాలు

సాధారణంగా పెళ్లిళ్లు, అన్నప్రాశనలు, పూజలు వంటివన్నీ పురుషులే చేస్తుంటారు. కానీ కలకత్తాకి చెందిన నందిని భౌమిక్ పదేళ్లుగా పురోహితురాలిగా వ్యవహరిస్తోంది. నందిని రెండో కూతురి వివాహానికి పురోహితుడు ఎవరూ దొరక్కపోవడంతో ఆమే పురోహితురాలిగా మారారు. ఈ నిర్ణయాన్ని పురుషుల కంటే మహిళలే ఎక్కువగా వ్యతిరేకించారంటున్నారు నందిని. ఎప్పటికైనా ప్రజల ఆలోచనా విధానంలో మార్పు తీసుకురావాలనేదే తన ఉద్దేశం అని చెబుతున్నారామె.


