News March 20, 2024
HYD: సమ్మర్ క్యాంపులు.. 2023లో వచ్చిన ఫీజు ఎంత..?

GHMC 2023లో నిర్వహించిన సమ్మర్ క్యాంపులలో ఎల్బీనగర్ నుంచి రూ.31,030, చార్మినార్- రూ.1,05,680, ఖైరతాబాద్- రూ.1,72,600, శేర్లింగంపల్లి- రూ.81,240, కూకట్పల్లి- రూ.74,840, సికింద్రాబాద్ సర్కిల్ నుంచి- రూ.1,11,220 ఫీజు వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 25 నుంచి మే 31వ తేదీ వరకు సమ్మర్ కోచింగ్ క్యాంపులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 44 రకాల క్రీడలపై తర్ఫీదు ఇవ్వనున్నారు.
Similar News
News April 8, 2025
HYD: AI అంటే అనుముల ఇంటలిజెన్స్: కవిత

అసెంబ్లీ ఆవరణలో ఫులే విగ్రహ ఏర్పాటుపై ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్షకు దిగారు. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ.. AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదని.. అనుముల ఇంటలిజెన్స్ అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్తో రాష్ట్రానికి ప్రమాదం లేదని, అనుముల ఇంటలిజెన్స్తో ప్రమాదం ఉందన్నారు. అది రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తుందని, దాన్ని పక్కకు జరిపితే తప్ప రాష్ట్రం బాగుపడదన్నారు.
News April 8, 2025
మైనర్ డ్రైవింగ్పై HYD పోలీసుల ప్రత్యేక డ్రైవ్

HYDలో సోమవారం మైనర్ డ్రైవింగ్ లపై పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సైదులు మాట్లాడుతూ.. చాలా ప్రమాదాలు డ్రైవింగ్పై అవగాహన లేకుండా, లైసెన్సు లేని మైనర్లు నడపడం వల్లనే జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రత్యేక తనిఖీల ద్వారా మైనర్లు నడిపిన వాహనాలు గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నామన్నారు. వాహనాలను ఇచ్చిన వారిపై కూడా చర్యలు ఉంటాయన్నారు.
News April 8, 2025
HYD- తిరుపతి వెళ్లే ప్రయాణికులకు గుడ్న్యూస్

HYD- తిరుపతి వెళ్లే ప్రయాణికులకు రైల్వే అధికారులు స్పెషల్ ట్రైన్ ప్రకటించారు. మే 23వ తేదీ వరకు వారానికి 2 సార్లు ఈ ట్రైన్ సేవలందిస్తుంది. చర్లపల్లి నుంచి (07017) శుక్ర, ఆదివారాల్లో, తిరుపతి నుంచి (07018) శని, సోమవారాల్లో నడుస్తుంది. మల్కాజిగిరి, కాచిగూడ, జడ్చర్ల, మహబూబ్నగర్, డోన్, కడప, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. చర్లపల్లి నుంచి రాత్రి 9.35కు, తిరుపతి నుంచి సాయంత్రం 4.40కు బయలుదేరుతుంది.