News February 15, 2025
జేసీ ప్రభాకర్పై కేసు నమోదు

TG: సినీ నటి, బీజేపీ నేత మాధవీలత ఫిర్యాదు మేరకు టీడీపీ నేత జేసీ ప్రభాకర్పై సైబరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా గత నెల 21న సోషల్ మీడియాలో తనను టార్గెట్ చేసి బెదిరిస్తున్నారని సైబరాబాద్ సీసీఎస్లో ఆమె కంప్లైంట్ ఇచ్చారు. జేసీ అనుచరులు, అభిమానులు తనను చంపుతామని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. జేసీ తనను అసభ్యపదజాలంతో దూషించారని ఆమె ఫిర్యాదులో తెలిపారు.
Similar News
News November 10, 2025
NOV 25వరకు SSC పరీక్ష ఫీజు చెల్లింపు గడువు

AP: టెన్త్ పబ్లిక్ పరీక్ష ఫీజును నవంబర్ 13నుంచి 25వరకు చెల్లించవచ్చని SSC బోర్డు డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. లేట్ ఫీ ₹50తో డిసెంబర్ 3వరకు, ₹200తో DEC 10వరకు, ₹500తో DEC 12వరకు చెల్లించవచ్చని చెప్పారు. ఫీజును https://bse.ap.gov.in లో స్కూల్ లాగిన్ ద్వారా మాత్రమే చెల్లించాలని పేర్కొన్నారు. బ్యాంక్ చలానా, CFMS చెల్లింపులను ఆమోదించబోమని వివరించారు. గడువు పొడిగింపు ఉండదని స్పష్టంచేశారు.
News November 10, 2025
HYDలో అలర్ట్.. విస్తృత తనిఖీలు

ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పోలీసులు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్, చెన్నై, ముంబైతో పాటు ఇతర ప్రధాన నగరాల్లో తనిఖీలు చేపడుతున్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, అనుమానాస్పద వాహనాల్లో చెకింగ్స్ చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో RPF, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. మరోవైపు CISF దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించింది.
News November 10, 2025
CNG కాదు.. ఆత్మాహుతి దాడేనా?

<<18252445>>ఢిల్లీ పేలుడు<<>> ఘటనకు CNG కారణమని తొలుత భావించారు. కానీ CNG పేలితే ఇంత భారీ తీవ్రత ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇది ఉగ్రవాద దాడి లేదా ఆత్మాహుతి దాడి అయి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేలుడుకు అమ్మోనియం నైట్రేట్ ఉపయోగించినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఎలాంటి ఉగ్రవాద సంస్థ ఈ పేలుడుకు బాధ్యత తీసుకుంటూ ఏ ప్రకటన చేయలేదు.


