News February 15, 2025
పెరిగిన బీర్ల అమ్మకాలు.. ఉత్పత్తి పెంచిన కంపెనీలు

TG: ఎండాకాలం రావడంతో బీర్ల అమ్మకాలు పెరుగుతున్నట్లు ఎక్సైజ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సరఫరా పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 13 సంస్థలు బీర్లను తయారు చేస్తున్నాయి. ఇప్పటివరకు 2 షిఫ్టుల్లో కార్మికులు పనిచేసేవారు. కానీ డిమాండ్ పెరగడంతో మూడు షిఫ్టుల్లో ఉత్పత్తి చేసేందుకు కంపెనీలు ప్లాన్ చేసుకున్నాయి. ఒక్కో కంపెనీ రోజుకు 2 లక్షల బీర్లను తయారుచేసి డిపోలకు పంపనున్నాయి.
Similar News
News January 24, 2026
2014 నుంచి విచారణ చేయిద్దాం: భట్టి

TG: సింగరేణి టెండర్లపై విచారణకు సిద్ధమని, 2014 నుంచి జరిగిన టెండర్లపై విచారణ చేయిద్దామని Dy.CM భట్టి అన్నారు. ‘హరీశ్ రావుకు విచారణ కావాలంటే మాకే లేఖ రాయండి. తాడిచర్ల నుంచి నైనీ వరకు అన్నింటిపై దర్యాప్తు చేయిద్దాం. CM రేవంత్ రాగానే విచారణ కోరతాం’ అని తెలిపారు. తన 40ఏళ్ల ప్రతిష్ఠను కట్టుకథలతో <<18943021>>దెబ్బతీయొద్దన్నారు<<>>. ఆస్తులు కూడబెట్టడానికి కాదు సమాజంలో మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు.
News January 24, 2026
పశువులకు మేతగా ఉల్లిపాయలతో డేంజర్

ఉల్లికి సరైన ధర లేకపోతే కొందరు రైతులు ఆ పొలాలను గొర్రెలు, మేకలు, పశువులకు మేతగా వదిలేస్తున్నారు. కానీ ఇలా చేయడం ప్రమాదకరమని వెటర్నరీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉల్లిపాయల్లో ఉండే N-propyl disulfide అనే రసాయనం పశువుల్లోని ఎర్రరక్తకణాలను విడదీస్తుందని తెలిపారు. దీనివల్ల వాటిలో బలహీనత, కళ్లు, మూత్రం ఎర్రగా మారడం, శ్వాసలో వేగం పెరగడం, కడుపులో వాపు, లక్షణాలు తీవ్రమైతే అవి మరణించే అవకాశం ఉందంటున్నారు.
News January 24, 2026
కాటన్ యూనివర్సిటీలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

గువాహటిలోని <


