News February 15, 2025

MBNR: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

ఈ నెల 12న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిని వ్యక్తి మృతిచెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. NGKL జిల్లా పెంట్లవెల్లికి చెందిన షాలు(45) అడ్డాకులలో ఉంటూ రాళ్లు కొడతూ జీవిస్తున్నారు. అడ్డాకుల వైపు నుంచి వచ్చిన పొక్లెయిన్ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రవీందర్(32) అక్కడికక్కడే మృతిచెందగా.. షాలుకు గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ షాలు శుక్రవారం మృతిచెందారు.

Similar News

News April 16, 2026

MBNR: పీయూ..డిగ్రీ 6వ సెమిస్టర్ పరీక్షలు

image

పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 6వ సెమిస్టర్ పరీక్షలు ఇవాళ ప్రారంభమయ్యాయి. వివేకానంద డిగ్రీ కళాశాలలో పరీక్షల నియంత్రణ అధికారిణి డాక్టర్ కే.ప్రవీణ పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. డాక్టర్ కే.ప్రవీణ మాట్లాడుతూ.. డిగ్రీ పరీక్షలు సజావుగా జరగాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, మాస్ కాఫీయింగ్‌కు అవకాశం లేకుండా చూడాలని అధికారులను సూచించారు.

News April 16, 2026

జడ్చర్ల: పీజీ వైద్య విద్యార్థి ఆత్మహత్య

image

జడ్చర్ల మండలంలోని కొడుగల్ ఉమ్మడి గ్రామపంచాయతీ పరిధి బిమ్లాగాని తండాకు చెందిన జనరల్ మెడిసిన్ పీజీ విద్యార్థి కాట్రావత్ సురేష్ హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో చదువుతున్న సురేష్ హాస్టల్ రూంలో పాయిజన్ ఇంజక్షన్ తీసుకొని మృతి చెందాడు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 16, 2026

సీసీ కుంట: శ్రావణి మృతి కేసులో మలుపు.. ప్రవీణ్ మృతి..!

image

చిన్నచింతకుంట(M) కురుమూర్తి స్వామి గుట్ట వద్ద బుధవారం నిన్న అనుమానాస్పదస్థితిలో మహిళ <<19658838>>మృతి చెందిన<<>> కేసు మలుపు తిరిగింది. ఎస్‌ఐ ఓబుల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మరికల్(M) వెంకటాపూర్‌కు చెందిన శ్రావణి(26) మృతదేహం అనుమానాస్పదంగా లభించగా, అదే గ్రామానికి చెందిన ప్రవీణ్ అక్కడే స్పృహ కోల్పోయి ఉన్నాడు. అతడిని 108లో ఆసుపత్రికి తరలించేలోపు మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.