News February 15, 2025

రాజాపేట తహశీల్దార్‌కు కుచ్చుటోపి

image

రాజాపేట తహశీల్దార్‌కి సైబర్ నేరగాళ్లు కుచ్చుటోపి పెట్టారు. పోలీసుల వివరాలిలా.. గుర్తుతెలియని దుండగుడు తహశీల్దార్‌ దామోదర్‌కు ఫోన్ చేశారు. తాను ఏసీబీ అధికారినని బెదిరించి డబ్బు డిమాండ్‌ చేశాడు. తహశీల్దార్‌ దామోదర్ ఆన్‌లైన్‌లో రూ.3.30 లక్షలు పంపాడు. కాల్ వివరాల ఆధారంగా మోసపోయానని తెలుసుకుని సైబర్‌ క్రైమ్‌లో ఫిర్యాదు చేశారు. రాచకొండ సైబర్‌ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News January 5, 2026

SBIలో 1146 జాబ్స్.. దరఖాస్తు గడువు పెంపు

image

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1,146 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు JAN 10 వరకు పొడిగించారు. ఇందులో VP వెల్త్(SRM) 582, AVP వెల్త్(RM) 237, కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 327 ఉన్నాయి. అభ్యర్థులకు డిగ్రీతో పాటు అనుభవం ఉండాలి. వయసు పోస్టును బట్టి 20-45 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం VP వెల్త్‌కి ₹44.70L AVP వెల్త్‌కి ₹30.20L, CREకి ₹6.20L చెల్లిస్తారు.
సైట్: <>sbi.bank.in<<>>

News January 5, 2026

చలి తీవ్రతతో కోళ్లకు పెరుగుతున్న ముప్పు

image

చలి గాలులు, పొగ మంచు వల్ల రాత్రి వేళ కోళ్ల షెడ్లలో తేమ అధికమై అది ఆవిరి కాకుండా ఉండిపోతుంది. దీని వల్ల కోళ్లలో శ్వాస సంబంధ వ్యాధుల ముప్పు, లిట్టర్‌లో తేమ శాతం పెరగడం వల్ల పరాన్నజీవులు, శిలీంధ్రాల బెడద పెరుగుతుంది. చలికి కోళ్లు ఒత్తిడికి లోనవడం వల్ల వాటిలో వ్యాధి నిరోధకత శక్తి తగ్గి CRD, ఐబీ, కొక్కెర రోగం, బ్రూడర్ న్యుమోనియా, కోకిడియోసిస్ వ్యాధుల ముప్పు పెరిగి కోళ్ల మరణాలకు కారణమయ్యే ప్రమాదం ఉంది.

News January 5, 2026

సూర్యాపేట: ట్యాంకర్ ఢీకొని అసిస్టెంట్ మేనేజర్ మృతి

image

తిరుమలగిరి మండలం తొండ గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యూనియన్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ సతీష్ (45) దుర్మరణం చెందారు. తన స్వగ్రామం ఐనోలు నుంచి వస్తుండగా, ఎదురుగా వచ్చిన పెట్రోల్ ట్యాంకర్ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.