News February 15, 2025

18, 19వ తేదీల్లో కృష్ణా ఎక్స్‌ప్రెస్ రీ షెడ్యూల్

image

వరంగల్ మీదుగా నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను నిర్ణీత సమయం కన్నా 90 నిమిషాల తేడాతో ఈ నెల 18, 19న రీ షెడ్యూల్ చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. విజయవాడ- కాజీపేట మధ్య ఇంటర్ లాకింగ్ సిస్టం వర్క్ బ్లాక్‌తో వరంగల్, కాజీపేట మీదుగా నడిచే పలు రైళ్లను దారి మళ్లించినట్లు చెప్పారు. ఈ నెల 17 నుంచి 20 వరకు షాలిమార్, కోణార్క్ రైళ్లను దారి మళ్లించారు. ఈ విషయాన్ని రైల్వే ప్రయాణికులు గమనించాలన్నారు.

Similar News

News February 27, 2026

సిరిసిల్ల: రైతు దీక్షకు తీన్మార్ మల్లన్న మద్దతు

image

రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన 12 గ్రామాల ప్రజలు ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కలిసి తమ సమస్యలను వివరించారు. ప్రస్తుతం పెద్ద లింగాపూర్ సబ్‌స్టేషన్ ఎదుట నిరాహార దీక్ష కొనసాగిస్తున్నామని, తమ దీక్షకు మద్దతుగా రావాలని తీన్మార్ మల్లన్నను కోరారు. 4న దీక్షా శిబిరానికి స్వయంగా హాజరై రైతులకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తానని అన్నారని తెలిపారు.

News February 27, 2026

ఉగాదికి లక్ష టిడ్కో ఇళ్ల పంపిణీ!

image

AP: ఉగాది(MAR 19) నాటికి లక్ష టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయనున్నట్లు పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ తెలిపారు. మిగతా గృహాల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసుకొనేందుకు లబ్ధిదారులకు రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లను కోరారు. దీంతో 40,500 మందికి ₹1,345Cr ఇచ్చేందుకు సమ్మతించారు. కాగా ఈ ఏడాది జూన్‌ నాటికి మొత్తంగా 2.61 లక్షల ఇళ్లను పేదలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

News February 27, 2026

చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు కన్నుమూత

image

TG: ప్రముఖ క్షేత్రం చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు సౌందర్‌రాజన్ (90) కన్నుమూశారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో చిలుకూరులోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కాగా 1981లో ప్రభుత్వం ఈయనను ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డుతో గౌరవించింది. చిలుకూరులో హుండీ లేకపోవడం, VIP దర్శనాలు లేకుండా అందరికీ ఒకే క్యూలైన్ వంటి సంస్కరణలు ప్రవేశపెట్టారు. సౌందర్‌రాజన్ మృతితో ఇవాళ, రేపు ఆలయం మూసివేస్తున్నట్లు ప్రకటించారు.