News February 15, 2025
18, 19వ తేదీల్లో కృష్ణా ఎక్స్ప్రెస్ రీ షెడ్యూల్

వరంగల్ మీదుగా నడిచే కృష్ణా ఎక్స్ప్రెస్ ట్రైన్ను నిర్ణీత సమయం కన్నా 90 నిమిషాల తేడాతో ఈ నెల 18, 19న రీ షెడ్యూల్ చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. విజయవాడ- కాజీపేట మధ్య ఇంటర్ లాకింగ్ సిస్టం వర్క్ బ్లాక్తో వరంగల్, కాజీపేట మీదుగా నడిచే పలు రైళ్లను దారి మళ్లించినట్లు చెప్పారు. ఈ నెల 17 నుంచి 20 వరకు షాలిమార్, కోణార్క్ రైళ్లను దారి మళ్లించారు. ఈ విషయాన్ని రైల్వే ప్రయాణికులు గమనించాలన్నారు.
Similar News
News January 22, 2026
జిల్లాలో 16,405 ఇండ్లు మంజూరు: ADB కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద 16,405 ఇండ్లు మంజూరు చేశామని, ఇందుకోసం రూ.156 కోట్లు విడుదల చేసినట్లు కలెక్టర్ రాజర్షి షా నాగోబా దర్బార్లో తెలిపారు. పీవీటీజీ కుటుంబాలకు ప్రత్యేకంగా 639 ఇండ్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ఇండ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని వివరించారు. ఈ నెల 26న ఢిల్లీలో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలలో పెందూర్ శాంతాబాయికి ఆహ్వానం లభించిందన్నారు.
News January 22, 2026
నాగోబా ఆలయ అభివృద్ధికి రూ.22 కోట్లు: సురేఖ

ఇంద్రవెల్లిలోని కేస్లాపూర్ నాగోబా దేవాలయ సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.22 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు, మౌలిక వసతుల కల్పనతో పాటు ఆలయ పరిసరాల అభివృద్ధికి ఈ నిధులు ఉపయోగించనున్నట్లు తెలిపారు. ధూప, దీప, నైవేద్యం పథకం కింద నాగోబా ఆలయంలో పనిచేస్తున్న ఏడుగురు సిబ్బందికి ప్రభుత్వం తరఫున వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
News January 22, 2026
రూ.1300 కోట్లతో 4 ప్రాజెక్టుల పూర్తి: మంత్రి కొండపల్లి

పూర్వోదయ పథకం ద్వారా జిల్లాలో నాలుగు కీలక ఇరిగేషన్ ప్రాజెక్టులను రూ.1300 కోట్లతో పూర్తి చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. తోటపల్లి ద్వారా ప్రస్తుతం 58వేల ఎకరాలకు సాగునీరు అందుతుండగా, మిగిలిన భూములకు కూడా నీరు అందేలా పనులు పూర్తి చేస్తామన్నారు. ఉత్తరాంధ్రలోని ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం రూ.2వేల కోట్లు కేటాయించిదన్నారు.


