News February 15, 2025

HYD: మంచినీటి సరఫరా.. మూడంచెల్లో క్లోరినేషన్!

image

జలమండలి నీటిని మూడంచెల్లో క్లోరినేషన్ చేస్తుందని HYDలో ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. మొదటి దశలో నీటి శుద్ధి కేంద్రాలు, రెండో దశలో మెయిన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, చివరగా సర్వీస్ రిజర్వాయర్ల వద్ద బూస్టర్ క్లోరినేషన్ చేస్తుంది. దీంతో పాటు ప్రజలకు సరఫరా చేసే నీటిలో కచ్చితంగా 0.5 పీపీఎం క్లోరిన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్న‌ట్లు వివ‌రించారు.

Similar News

News November 4, 2025

సంతబొమ్మాళి: ‘చిన్నారులకు ఇస్తున్న వ్యాక్సిన్‌పై నిర్లక్ష్యం తగదు’

image

చిన్నారులకు క్రమం తప్పకుండా ఇస్తున్న వ్యాక్సిన్‌పై నిర్లక్ష్యం తగదని DyDMHO డాక్టర్ మేరీ కేథరిన్ అన్నారు. సంతబొమ్మాళి మండలం నౌపడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం సందర్శించి పీహెచ్సీ సిబ్బంది, ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. క్రమం తప్పకుండా చిన్నారులకు వ్యాక్సిన్ వేయాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News November 4, 2025

త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టిన ఎస్‌బీఐ

image

బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ లాభాలను నమోదు చేసింది. ఈ FYలో సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్‌లో రూ.20,160 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాదితో పోలిస్తే(రూ.18,331 కోట్లు) 10% వృద్ధి సాధించింది. నికర వడ్డీ ఆదాయం 3% పెరిగి రూ.42,985 కోట్లకు చేరింది. వడ్డీ ద్వారా వచ్చే ఆదాయం రూ.1,19,654 కోట్లకు పెరిగింది. ఫలితాల నేపథ్యంలో SBI షేర్లు స్వల్పంగా లాభపడి రూ.954.6 వద్ద ముగిశాయి.

News November 4, 2025

రైల్వే స్టేషన్లలో సమస్యలపై ప్రస్తావించాం: VZM ఎంపీ

image

విజయనగరం, బొబ్బిలి రైల్వే స్టేషన్లలో వేచి ఉండే హాల్, మరుగుదొడ్లు, ఎస్కలేటర్లు, తదితర సదుపాయాలు కల్పించాలని ఎంపీ అప్పలనాయుడు కోరారు. విశాఖలో మంగళవారం జరిగిన ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కి హాల్ట్, భువనేశ్వర్, తిరుపతి రైళ్లను ప్రతిరోజూ నడపడం, శబరిమల యాత్రికుల కోసం ప్రత్యేక రైళ్లు నడపాలని కోరినట్లు ఎంపీ తెలిపారు.