News February 15, 2025
రహదారి భద్రత నిరంతర ప్రక్రియ: కలెక్టర్

రహదారి భద్రత నిరంతర ప్రక్రియ అని, వాహనదారులందరూ నిత్యం రహదారి నియమాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. శనివారం అమలాపురంలోని కోనసీమ జిల్లా కలెక్టరేట్లో 36వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల 2025 ముగింపు సమావేశాన్ని ఆయన ఆటో డ్రైవర్లు, వివిధ కళాశాలల విద్యార్థులతో నిర్వహించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించడం వలన ప్రమాదాలను నివారించవచ్చన్నారు.
Similar News
News November 14, 2025
విజయవాడ GGHలో ప్రైవేట్ అంబులెన్సుల హవా..!

విజయవాడ GGHలో ప్రైవేట్ అంబులెన్స్ల హవా నడుస్తోంది. ఆసుపత్రి ఆవరణలోకి ప్రైవేట్ అంబులెన్స్లు తీసుకురావొద్దని ఆంక్షలున్నా, ఎమర్జెన్సీ విభాగం వద్ద యథేచ్ఛగా ఇవి తిష్ట వేస్తున్నాయి. ఆసుపత్రి సిబ్బందికి మామూళ్లు ఇస్తే చాలు, ప్రైవేట్ అంబులెన్స్లను అనుమతిస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ అంబులెన్స్లను సైతం పక్కనపెట్టి దందా చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
News November 14, 2025
ఇతిహాసాలు క్విజ్ – 66 సమాధానాలు

ఈరోజు ప్రశ్న: విదురుడు హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠించకుండా ‘మంత్రి’ పాత్రకే ఎందుకు పరిమితమయ్యారు?
జవాబు: ధృతరాష్ట్రుడు, పాండురాజు.. ఈ ఇద్దరూ అంబిక, అంబాలిక గర్భాన జన్మించారు. కానీ, విదురుడు దాసి గర్భాన జన్మించడం వలన, ఆనాటి రాజ్యాంగ నియమం ప్రకారం సింహాసనాన్ని అధిష్ఠించే అర్హతను కోల్పోయి, మంత్రి పాత్రకే పరిమితం అయ్యారు.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 14, 2025
ములుగు కలెక్టర్ను ఇంటర్వ్యూ చేసిన బాలలు

ములుగు కలెక్టర్ దివాకర్ను విద్యార్థులు ఇంగ్లిషులో ఇంటర్వ్యూ చేశారు. బాలల దినోత్సవం సందర్భంగా ఇంగ్లిష్ లెర్న్ టు రీడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు కలెక్టర్తో ముఖాముఖి నిర్వహించారు. అలవాట్లు, అభిరుచులు, తదితర విషయాలను అడిగారు. జిల్లాలోని 72 ప్రాథమిక పాఠశాలలో ఇంగ్లిష్ చదవడం, నేర్చుకోవడం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.


