News February 15, 2025

సామర్లకోట: రైలు ఎక్కుతూ యువకుడు మృతి

image

యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ నాయకర్ కాలనీకి చెందిన వాకాడ జాన్ బాబు (27) శనివారం ఉదయం సామర్లకోట రైల్వే స్టేషన్‌లో నూజివీడు వెళ్లేందుకు తన తండ్రి, భార్య, కుమారుడితో కలిసి ట్రైన్ ఎక్కుతుండగా జారి పడిపోయాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో అతని తండ్రి, భార్య నిశ్చేష్టులయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి డెడ్‌బాడీని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Similar News

News September 19, 2025

సంగారెడ్డి: ప్రమాదాలు జరగకుండా చూడాలి: ఎస్పీ

image

నేషనల్ హైవే 161 రోడ్డుపై రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎస్పీ పారితోష్ పంకజ్ ఆదేశించారు. పుల్కల్ మండల పరిధిలోని నేషనల్ హైవే ప్రాంతాన్ని గురువారం పరిశీలించారు. హైవేపై రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాహనాల వేగం అదుపు చేసేందుకు ర్యాంబుల్ స్ట్రిప్స్, ఇసుక డ్రమ్ములు ఏర్పాటు చేయాలని సూచించారు.

News September 19, 2025

20న జనగామలో ఫుట్‌బాల్ క్రీడా ఎంపికలు

image

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 20న జనగామ సాంఘిక సంక్షేమ బాలుర గురుకులంలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి అండర్-19 ఫుట్‌బాల్ క్రీడా ఎంపికలు జరుగుతాయి. ప్రతి కళాశాల నుంచి ఐదుగురికి మాత్రమే అవకాశం ఉంటుందని క్రీడల కన్వీనర్ అజ్మీర కిషన్ తెలిపారు.

News September 19, 2025

పాకిస్థాన్ ఓవరాక్షన్‌పై ICC సీరియస్!

image

ఆసియా కప్: యూఏఈతో మ్యాచ్ సందర్భంగా పాకిస్థాన్ ఓవరాక్షన్ వల్ల మ్యాచ్ గంట ఆలస్యమైన విషయం తెలిసిందే. ఆ రోజు రూల్స్ అతిక్రమించారని PCBకి ICC లేఖ, ఈమెయిల్స్ పంపినట్లు తెలుస్తోంది. స్టేడియంలో వీడియో రికార్డ్ చేసి వారి SM ఖాతాల్లో పోస్ట్ చేయడంపై కూడా సీరియస్‌గా ఉంది. ఈ నేపథ్యంలోనే PCBపై చర్యలు తీసుకునేందుకు ICC సిద్ధమవుతోందని సమాచారం. ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.