News February 15, 2025

భారత్‌లో పర్యటించనున్న ఖతర్ దేశాధినేత

image

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఖతర్ దేశాధినేత షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ తనీ ఈ నెల 17-18 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ పర్యటనలో దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు కేంద్ర మంత్రులు, సీనియర్ అధికారులు, వ్యాపారవేత్తలతో ఆయన భేటీ కానున్నట్లు తెలిపింది.

Similar News

News January 28, 2026

మున్సిపల్ ఎన్నికలకు రాజకీయ పార్టీలు సహకరించాలి: కలెక్టర్

image

నల్గొండ కార్పొరేషన్‌తో పాటు ఆరు మున్సిపాలిటీల్లో శాంతియుత పోలింగ్‌కు రాజకీయ పక్షాలు సహకరించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ కోరారు. బుధవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని 162 వార్డుల కోసం 475 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈసారి ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలోనే జరుగుతాయని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News January 28, 2026

బడ్జెట్ సమావేశాల డేట్ ఫిక్స్

image

AP: రాష్ట్ర బడ్జెట్ సమావేశాల డేట్ ఫిక్సయింది. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ నెల 14న ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అదే రోజు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెెెెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు. మార్చి 12 వరకు సమావేశాలు కొనసాగే ఆస్కారముంది.

News January 28, 2026

అనేక ప్రశ్నల్ని మిగిల్చిన అజిత్ ఆకస్మిక మృతి

image

అజిత్ పవార్ ఆకస్మిక మృతి MH రాజకీయాల్లో పలు ప్రశ్నలను మిగిల్చింది. 2023లో అజిత్ శరద్ పవార్ NCPని వీడి 41 మంది MLAలతో ప్రభుత్వంలో చేరారు. తాజాగా MNP ఎలక్షన్లో శరద్‌తో కలిశారు. 2 వర్గాలు విలీనం కావొచ్చన్న క్రమంలో ఆయన మరణం దాన్ని సందిగ్ధంలోకి నెట్టింది. అటు విలీనమైతే అజిత్ వారసుల పరిస్థితేమిటి? కాకుంటే అజిత్ వర్గానికి నేతృత్వం వహించేదెవరు? అనే ప్రశ్నలూ ఉన్నాయి. GOVTలో కొనసాగితే Dy CM ఎవరనేదీ తేలాలి.