News February 15, 2025

సంగారెడ్డి: పోలీసు దళాలకు మొబిలైజేషన్ కార్యక్రమం

image

సంగారెడ్డిలో సాయుధ పోలీసు దళాలకు మొబిలైజేషన్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ చెన్నూరి రూపేష్ మాట్లాడుతూ.. పర్సనల్ సెక్యూరిటీ అధికారులు వీఐపీ భద్రత విషయంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉండడానికి వీలులేదని ఆదేశించారు. రోజు వ్యాయామం చేస్తూ ఫిజికల్ ఫిట్నెస్ కాపాడుకోవాలన్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. ఏఆర్డిఎస్పి నరేందర్ , సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News January 14, 2026

NRPT: పట్టాదారు పాసుపుస్తకాల జారీలో జాప్యం

image

జిల్లాలో పట్టాదారు పాసుపుస్తకాల జారీ తీవ్రంగా ఆలస్యమవుతోంది. భూమి రిజిస్ట్రేషన్ చేసి 9 నెలలు గడుస్తున్నా పాసుపుస్తకాలు అందకపోవడంతో రైతులు, కొనుగోలుదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పాసుపుస్తకం లేక బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. మీసేవలో ఛార్జీలు వసూలు చేస్తున్నా సేవలు సకాలంలో అందడం లేదని, గతంలో ధరణి పోర్టల్ ద్వారా త్వరగా పాసుపుస్తకాలు వచ్చేవని రైతులు అంటున్నారు.

News January 14, 2026

NLG: లండన్ వేదికగా చేనేత కళా వైభవం

image

చండూరుకు చెందిన చేనేత కళాకారుడు చిలుకూరి శ్రీనివాస్ అంతర్జాతీయ వేదికపై భారతీయ చేనేత నైపుణ్యాన్ని చాటనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు లండన్‌లో జరిగే ‘స్ప్రింగ్ ఫెయిర్’ వర్తక ప్రదర్శనలో చేనేత లైవ్ డెమో ఇచ్చేందుకు ఆయన ఎంపికయ్యారు. ఈ నెల 29న ఆయన లండన్ బయలుదేరనున్నారు. తన ఎంపికకు సహకరించిన కేంద్ర చేనేత సేవా కేంద్రం డైరెక్టర్ అరుణ్‌కు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.

News January 14, 2026

పాలక్ పనీర్ తంటా: ఇండియన్ స్టూడెంట్స్‌కు ₹1.80 కోట్ల పరిహారం

image

USలోని కొలరాడో వర్సిటీలో వివక్షకు గురైన ఇండియన్ Ph.D విద్యార్థులు ఆదిత్య ప్రకాష్, ఊర్మి భట్టాచార్య న్యాయపోరాటంలో నెగ్గారు. క్యాంపస్‌లో 2023లో పాలక్ పనీర్ వేడి చేస్తున్న టైమ్‌లో సిబ్బంది ఆ వాసనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివాదం ముదిరి వారి డిగ్రీలను నిలిపివేసే వరకు వెళ్లడంతో కోర్టును ఆశ్రయించారు. ఫలితంగా వర్సిటీ వారికి దాదాపు ₹1.80 కోట్ల పరిహారం చెల్లించడంతో పాటు మాస్టర్స్ డిగ్రీలను అందజేసింది.