News February 15, 2025
ప్రకాశం జిల్లాలోకి కందుకూరు?

AP: ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉన్న కందుకూరును ప్రకాశం జిల్లాలో కలిపే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గాన్ని ప్రకాశంలో కలిపేందుకు అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని CM చంద్రబాబు ప్రకటించారు. వెలిగొండ పూర్తి చేసి కందుకూరుకు నీళ్లు ఇస్తామన్నారు. అటు పట్టణానికి రూ.50 కోట్లు మంజూరు చేసిన CM ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చాలని సూచించారు. అలాగే గర్భ కండ్రిక భూముల సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు.
Similar News
News July 10, 2025
నేడు మెగా పేరెంట్-టీచర్ మీట్ 2.0

AP: ప్రభుత్వం మరో రికార్డు సృష్టించేందుకు సిద్ధమైంది. ఒకే రోజు 2 కోట్ల మందితో రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్-టీచర్ మీట్ నిర్వహించనుంది. 74,96,228 మంది స్టూడెంట్స్, 3,32,770 మంది టీచర్స్, 1,49,92,456 మంది పేరెంట్స్, దాతలు ఈ వేడుకలో పాల్గొనున్నారు. మొత్తం 2.28 కోట్ల మంది ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. పుట్టపర్తి కొత్తచెరువు ZP స్కూల్లో కార్యక్రమానికి CM చంద్రబాబు, లోకేష్ హాజరు కానున్నారు.
News July 10, 2025
విశాఖలో CII పార్టనర్షిప్ సమ్మిట్

AP: నవంబరు 14,15 తేదీల్లో విశాఖలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్(CII) 30వ పార్ట్నర్షిప్ సమ్మిట్ జరగనుంది. సదస్సు సన్నాహక ఏర్పాట్లపై సచివాలయంలో CS విజయానంద్ ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. రిజిస్ట్రేషన్, ఇతర ఏర్పాట్లకు సంబంధించిన అంశాలను ఆన్లైన్ చేయాలన్నారు. సదస్సును సక్సెస్ చేసేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు మొదలు పెట్టాలని పరిశ్రమల శాఖ అధికారులు, విశాఖ కలెక్టర్ను ఆదేశించారు.
News July 10, 2025
చరిత్ర సృష్టించారు.. ఇంగ్లండ్పై తొలి టీ20 సిరీస్ కైవసం

ఇంగ్లండ్ ఉమెన్-టీమిండియా ఉమెన్ మధ్య జరిగిన నాలుగో టీ20లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ని ఇంకో మ్యాచ్ ఉండగానే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. 127 పరుగుల లక్ష్యాన్ని 3 ఓవర్లు మిగిలుండగానే ఛేదించారు. ఇంగ్లండ్ ఉమెన్పై మనకు ఇదే తొలి సిరీస్ విజయం. ఇరు దేశాల మధ్య 6 ద్వైపాక్షిక సిరీస్లు జరగ్గా.. అన్నింటినీ ఇంగ్లండే గెలిచింది. రాధ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.