News February 16, 2025
ఇన్ శానిటరీ లెట్రిన్ జిల్లాగా కామారెడ్డి: కలెక్టర్

కామారెడ్డిని ఇన్ శానిటరీ లెట్రిన్ రహిత జిల్లాగా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రకటించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లాలో అన్ని గ్రామపంచాయతీ, మున్సిపాలిటీల్లో గతంలో నిర్వహించిన సర్వే ప్రకారం.. మ్యానువల్ స్కావెంజర్లు లేనట్లు తేలిందన్నారు. దీనిపై గత నెల 24వ తేదీన అభ్యంతరాలను కోరగా, ఎలాంటి అభ్యంతరాలు రాలేదన్నారు. ఇన్ శానిటరీ లెట్రిన్ జిల్లాగా ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
Similar News
News November 10, 2025
స్పీకర్పై BRS కోర్టు ధిక్కార పిటిషన్

TG: ఫిరాయింపు MLAలపై నిర్దేశించిన 3 నెలల గడువులోగా చర్యలు తీసుకోలేదని TG స్పీకర్పై BRS పార్టీ న్యాయవాది మోహిత్రావు SCలో ధిక్కార పిటిషన్ వేశారు. అత్యవసరంగా దీనిపై విచారించాలని కోరారు. ఉద్దేశపూర్వకంగా స్పీకర్ ఆలస్యం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈనెల 23న ప్రస్తుత CJI రిటైర్ అవుతారని, కొత్త CJI వస్తే మొదట్నుంచి విచారించాల్సి ఉంటుందని వివరించారు. వచ్చే సోమవారం విచారిస్తామని జస్టిస్ గవాయ్ చెప్పారు.
News November 10, 2025
సంక్రాంతికి ఊరెళ్తున్నారా? రైల్వే టికెట్ బుకింగ్స్ మొదలు!

వచ్చే సంక్రాంతికి (జనవరి 2026) ఊళ్లకు వెళ్లాలనుకునేవారికి అలర్ట్. భారతీయ రైల్వే టికెట్ బుకింగ్స్ 60 రోజుల ముందుగానే ప్రారంభమవుతాయి. ఇవాళ జనవరి 9వ తేదీవి, రేపు JAN 10, ఎల్లుండి JAN 11, గురువారం రోజున జనవరి 12వ తేదీకి సంబంధించిన టికెట్లు రిలీజ్ కానున్నాయి. సొంతూళ్లకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండి IRCTC అధికారిక వెబ్సైట్ లేదా యాప్ ద్వారా వెంటనే బుక్ చేసుకోవచ్చు. SHARE IT
News November 10, 2025
ఎల్లారెడ్డిపేట: ‘పాఠశాలల్లో నాణ్యమైన భోజనం అందించాలి’

ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సోమవారం ఇన్చార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించి నిత్యం చదివించడం, రాయించడం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.


