News February 16, 2025

అంబేడ్కర్ కోనసీమ: 18న పరస్పర అవగాహన సదస్సు

image

విదేశాలలో వివిధ రకాల ఉద్యోగాలు, ఉపాధిని పొంది కుటుంబాలను పోషించాలనుకునేవారు, విదేశాలకు వెళ్లి మోసపోయిన వారు, విదేశాలకు వెళ్లే వారికి మధ్యవర్తిత్వం వహించే ఏజెంట్లతో ఈనెల 18న పరస్పర అవగాహన సదస్సును నిర్వహించనున్నట్లు కోనసీమ కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సమావేశం 18వ తేదీ ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌లో నిర్వహిస్తామన్నారు.

Similar News

News February 28, 2026

జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువు పొడిగింపు: DPRO

image

నిర్మల్ జిల్లాలోని జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువును ప్రభుత్వం మరో రెండు నెలలు పొడిగించినట్లు జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి (DPRO) తెలిపారు. కార్డులు కలిగిన జర్నలిస్టులు మధ్యాహ్నం 3 గంటల నుంచి తమ ఒరిజినల్ కార్డులతో కార్యాలయానికి రావాలని సూచించారు. అక్కడ గడువు పెంపునకు సంబంధించిన స్టిక్కర్లు వేయించుకోవాలని ఒక ప్రకటనలో కోరారు.

News February 28, 2026

అల్లూరి: 2 నుంచి సార్వత్రిక విద్యా పీఠం ఇంటర్ పరీక్షలు

image

అల్లూరి జిల్లాలో సోమవారం నుంచి ఏపీ సార్వత్రిక విద్యా పీఠం ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ శశికుమార్ శనివారం తెలిపారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. ఉదయం 8.30కే విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. అన్ని కేంద్రాల్లో 163 సెక్షన్ అమలులో ఉంటుందని, మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా చర్యలు చేపట్టామని తెలిపారు.

News February 28, 2026

HYD దాహార్తిని తీర్చేందుకు సర్కార్ స్కెచ్

image

HYD దాహార్తిని తీర్చేందుకు సర్కార్ అదిరిపోయే స్కెచ్ వేసింది. నియోపోలిస్ ఎత్తు ప్రాంతాన్ని వాడుకొని పైసా ఖర్చు లేకుండా గ్రావిటీతో నీళ్లందించేలా పక్కా ప్లాన్ రెడీ చేసింది. కొండపై భారీ రిజర్వాయర్లు కట్టి.. అక్కడి నుంచి మెహదీపట్నం, షేక్‌పేట, బోజగుట్టలకు గోదావరి జలాలను పారించనున్నారు. పంపింగ్ అవసరం లేకపోవడంతో జలమండలికి కోట్లాది రూపాయల కరెంటు బిల్లులు ఆదా కానున్నాయి. నగరవాసుల నీటి కష్టాలు తీరనున్నాయి.