News February 16, 2025

కులగణంలో పాల్గొనని వారికి మరోసారి సర్వే: కలెక్టర్

image

తెలంగాణలో తొలిసారి చేపట్టిన కులగణన సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే)లో ఎవరైతే వివిధ కారణాలచే నమోదు చేసుకోలేదో అటువంటి వారి కోసం మరోసారి సర్వే నిర్వహణ ఉంటుందని కలెక్టర్ హనుమంత రావు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 16 నుంచి 28 వరకు సర్వేను నిర్వహిస్తామని, ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు టోల్ ఫ్రీ నంబర్ 040-211111111 సంప్రదించవచ్చన్నారు.

Similar News

News January 10, 2026

ఆసిఫాబాద్: సెలవుల్లో జాగ్రత్త.. పిల్లలపై ఓ కన్నేయండి

image

ఆసిఫాబాద్ జిల్లాలో నేటి నుంచి పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ప్రారంభమయ్యాయి. వారం రోజుల పాటు విద్యార్థులు ఇంట్లోనే ఉండనున్న నేపథ్యంలో తల్లిదండ్రులు వారి కదలికలపై నిఘా ఉంచాలని అధికారులు సూచించారు. గాలిపటాలు ఎగురవేసేటప్పుడు చైనా మాంజా వాడకుండా చూడాలని, విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని కోరారు. అలాగే పిల్లలు ద్విచక్ర వాహనాలతో రోడ్లపైకి రాకుండా జాగ్రత్త వహించాలని హెచ్చరించారు.

News January 10, 2026

GNT: ప్రముఖ జర్నలిస్ట్, రచయిత డి. ఆంజనేయులు

image

జర్నలిస్ట్ ధూళిపూడి ఆంజనేయులు (డి.ఎ) సాహితీ లోకానికి చిరపరిచితులు. గుంటూరు జిల్లా యలవర్రులో 1924 జనవరి 10న జన్మించిన ఆయన, ది హిందూ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వంటి పత్రికల్లో పనిచేశారు. ఆకాశవాణి ‘వాణి’ పత్రికకు సంపాదకత్వం వహించారు. తెలుగు సాహిత్యాన్ని, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి కవితలను ఆంగ్లంలోకి అనువదించి ఇతర ప్రాంతాల వారికి పరిచయం చేశారు. కందుకూరి, సి.ఆర్.రెడ్డి జీవిత చరిత్రలు రచనలు చేశారు.

News January 10, 2026

కర్నూలు పోలీసుల డబ్బుల బేరం.. రంగంలోకి DGP!

image

KNLలోని ఓ PSలో పనిచేస్తున్న నలుగురు క్రైం పార్టీ సిబ్బంది అవినీతి చర్చనీయాంశమైంది. ఇటీవల ఓ చోరీ కేసులో హైదరాబాద్‌కు చెందిన వ్యాపారిని కర్నూలుకు తీసుకొచ్చారు. అయితే మార్గమధ్యంలో శివరాంపల్లి వద్ద అతనితో బేరం కుదుర్చుకొని డబ్బులు ఫోన్ పే చేయించుకున్నారు. ఈ విషయంపై ఆ వ్యాపారి తెలంగాణ ప్రజాప్రతినిధుల ద్వారా AP DGPతో మాట్లాడించారు. చర్యలకు జిల్లా ఉన్నతాధికారులను DGP ఆదేశించినట్లు తెలుస్తోంది.