News March 20, 2024
నెహ్రూ విదేశాంగ విధానం బుడగతో సమానం: జైశంకర్

చైనా విషయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ హెచ్చరించినా అప్పటి ప్రధాని నెహ్రూ ఉదాసీనంగా వ్యవహరించారని కేంద్ర మంత్రి జైశంకర్ విమర్శించారు. నెహ్రూ అవలంబించిన విదేశాంగ విధానం బుడగతో సమానమని వర్ణించారు. అమెరికా అంటే కోపంతో చైనాను అప్పట్లో భారత్ మిత్రదేశంగా చెప్పేవారన్నారు. ఆ విషయాన్ని అందరూ నమ్మారని.. కొందరు ఇప్పటికీ నమ్ముతున్నారని సెటైర్ వేశారు.
Similar News
News September 9, 2025
4 దశల్లో స్థానిక ఎన్నికలు: SEC

APలో స్థానిక సంస్థలకు 4 దశల్లో <<17606799>>ఎన్నికలు<<>> జరుపుతామని SEC నీలం సాహ్ని చెప్పారు. మొత్తం 1,37,671 పోలింగ్ స్టేషన్లు ఉంటాయన్నారు. EVMలతో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వాన్ని సంప్రదిస్తామని తెలిపారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్లో EVMలు వాడారని గుర్తు చేశారు. EVMల కొనుగోలు, వినియోగంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది.
News September 9, 2025
ఉపరాష్ట్రపతి ఎన్నిక.. ముగిసిన పోలింగ్

ఉపరాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ ముగిసింది. ఈ ఉదయం 10 గం. నుంచి సా.5 గంటల వరకు ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 768 ఓట్లు పోల్ అయ్యాయి. సా.6 గం. నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కౌంటింగ్ ముగిశాక ఈసీ అధికారులు ఫలితాలను అధికారికంగా వెల్లడించనున్నారు.
News September 9, 2025
నిర్మలా సీతారామన్తో సీఎం రేవంత్ భేటీ

TG: ఢిల్లీ పర్యటనలో ఉన్న CM రేవంత్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. ఆయన వెంట ఎంపీలు చామల కిరణ్, మల్లు రవి, బలరాం నాయక్, సురేశ్ షెట్కర్ ఉన్నారు. ఇటీవల భారీ వర్షాలు, వరదలతో సంభవించిన నష్టంపై ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంచనాను ఇచ్చింది. దీంతో పాటు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటుకు ప్రత్యేక నిధులు, రాష్ట్రానికి ఆర్థిక సాయం అందించాలని CM కోరారు.