News February 16, 2025
IPL 2025: సీఎస్కే తొలి మ్యాచ్ ఎవరితో అంటే?

మార్చి 21 నుంచి ఐపీఎల్ 2025 ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్లో సీఎస్కే తన తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్తో ఆడనున్నట్లు Espn Cricinfo పేర్కొంది. చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగే ఈ మ్యాచులో ఐదేసి సార్లు కప్పు గెలిచిన ఈ జట్లు పోటీపడతాయని తెలిపింది. కాగా ఆర్సీబీ VS కేకేఆర్ (ఈడెన్ గార్డెన్లో), SRH vs RR (HYDలో) తమ తొలి మ్యాచ్లు ఆడే అవకాశం ఉందని చెప్పింది.
Similar News
News February 21, 2025
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ

బంగ్లాతో విజయం అనంతరం భారత కెప్టెన్ రోహిత్ ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. 70శాతానికి పైగా సక్సెస్ రేటుతో 100 విజయాలు దక్కించుకున్న కెప్టెన్గా పాంటింగ్ రికార్డును ఆయన సమం చేశారు. అన్ని ఫార్మాట్లూ కలిపి 137మ్యాచులకు కెప్టెన్సీ చేసిన రోహిత్ 33మ్యాచుల్లో మాత్రమే ఓటమిని చూశారు. 3 గేమ్స్ డ్రా అయ్యాయి. ఒకటి రద్దయింది. ఇక 30 ఏళ్లు దాటాక కెప్టెన్సీలో 100 విజయాలు సాధించిన ప్లేయర్ రోహిత్ మాత్రమే.
News February 21, 2025
బిడ్డను కోల్పోయిన తల్లులకు 60రోజుల సెలవు: హిమాచల్

ప్రభుత్వోద్యోగం చేసేవారిలో చనిపోయిన బిడ్డకు జన్మనిచ్చిన లేదా పుట్టిన బిడ్డ చనిపోయిన తల్లులకు మాతృత్వ సెలవుల్ని 60 రోజుల పాటు ఇవ్వనున్నట్లు హిమాచల్ ప్రదేశ్ ప్రకటించింది. ఇప్పటికే ఉన్న మెటర్నిటీ లీవ్ నిబంధనలే ఈ సెలవులకూ వర్తిస్తాయని పేర్కొంది. అటు పీజీ చదువుతున్న ఎంబీబీఎస్ వైద్యులకు పూర్తి జీతాన్ని ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది.
News February 21, 2025
నేటి నుంచి శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలు

AP: దక్షిణ కైలాసంగా పేరొందిన శ్రీకాళహస్తిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేటి నుంచి మార్చి 6 వరకు వైభవంగా జరగనున్నాయి. ఇవాళ సాయంత్రం భక్త కన్నప్ప ధ్వజారోహణంతో ఉత్సవాలకు అర్చకులు అంకురార్పణ చేస్తారు. తర్వాత రోజుకొక వాహనాన్ని స్వామివారి సేవలకు వినియోగిస్తారు. ఉత్సవాలకు హాజరుకావాలని పలువురు సీఎంలు, ప్రముఖ హీరోలకు స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇప్పటికే ఆహ్వానపత్రికలు అందజేశారు.