News March 20, 2024

అమేథీలో కాంగ్రెస్‌కు ’21’ గండం తొలగినట్టేనా?

image

2019 ఎన్నికల్లో కంచుకోట అనుకున్న అమేథీలో ఓటమి కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చింది. ’21’ గండం వల్లే ఇలా జరిగిందని ఈసారి గెలుపు పక్కా అంటున్నాయి ఆ పార్టీ శ్రేణులు. ఈ 21 సంఖ్య కాంగ్రెస్‌కు కలిసిరావట్లేదట. 1977లో తొలిసారి అమేథీలో ఓడిపోగా మళ్లీ 21 ఏళ్లకు 1998లో ఓటమిపాలైంది. 21ఏళ్ల తర్వాత మళ్లీ 2019లో ఓడింది. మరోవైపు రాజీవ్ గాంధీ చనిపోయిన తేదీ మే 21 కావడం, అప్పుడు రాహుల్ వయస్సు 21 ఏళ్లు కావడం గమనార్హం.

Similar News

News October 1, 2024

HYD నుంచి సైన్యానికి చేరిన మొదటి స్వదేశీ సబ్‌మెషీన్ గన్స్

image

ASMI పేరుతో భారత్‌లో డెవలప్ చేసిన మొదటి సబ్‌మెషీన్ గన్స్‌ సైన్యం చేతికి అందాయి. వీటి డిజైన్, డెవలప్‌మెంట్, తయారీకి మూడేళ్ల కన్నా తక్కువ సమయమే పట్టింది. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఇజ్రాయెల్ Uzi, జర్మనీ MP5 కన్నా ఇవెంతో మెరుగ్గా పనిచేస్తాయి. పైగా వాటితో పోలిస్తే 10-15% బరువు, 30% ధర తక్కువ. రూ.లక్ష లోపే లభిస్తాయి. హైదరాబాద్ కంపెనీ లోకేశ్ మెషీన్స్ 550 ASMITA గన్స్‌ను ఆర్మీకి డెలివరీ చేసింది.

News October 1, 2024

ఒత్తిడితో ఆత్మహత్య ఆలోచనలా? ఈ నంబర్‌కు కాల్ చేయండి!

image

ఉద్యోగంలో ఒత్తిడి పెరిగి ఆత్మహత్యలు చేసుకుంటుండటం ఆందోళనకరం. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనను తొలగించి మిమ్మల్ని మానసికంగా దృఢంగా మార్చేందుకు కేంద్రం ఉచితంగా కౌన్సెలింగ్ ఇస్తోంది. దీనికోసం టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800-599-0019కు కాల్ చేయాలి. ఒత్తిడి నిర్వహణ, మానసిక ఆరోగ్యం, సానుకూల ధోరణిని పెంచడం వంటి మానసిక ఆరోగ్య సేవలను ఈ హెల్ప్‌లైన్ అందిస్తుంది. ఇది 24 గంటలూ అందుబాటులో ఉంటుంది. >>SHARE IT

News October 1, 2024

ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్

image

AP: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా ఐఐటీ, నీట్ శిక్షణ ఇచ్చేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. తొలి దశలో కర్నూలు, నెల్లూరు, గుంటూరు, విశాఖలో కేంద్రాలు సిద్ధం చేసి నిపుణులతో తరగతులు చెప్పించనుంది. ఫస్టియర్ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఎంట్రన్స్ నిర్వహించి, అందులో ప్రతిభ చూపినవారిని ట్రైనింగ్‌కు ఎంపిక చేయనుంది. ఇందుకోసం నారాయణ కాలేజీల సహకారం తీసుకోనున్నట్లు సమాచారం.