News February 16, 2025

కరీంనగర్: మహాశివరాత్రికి ప్రత్యేక బస్సులు

image

మహా శివరాత్రి పురస్కరించుకొని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి పుణ్య క్షేత్రానికి KNR, ఆదిలాబాద్, WGL, NZB రీజియన్లలోని వివిధ డిపోల నుంచి ఈ నెల 25 నుంచి 27 వరకు 778 అదనపు బస్సులు నడుపుతున్నామని KNR RM బి.రాజు ఒక ప్రకటనలో తెలిపారు. వేములవాడతో పాటు ఉమ్మడి KNR జిల్లాలోని వివిధ శైవ క్షేత్రాలకు, భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం శైవ క్షేత్రానికి కూడా అదనపు బస్సులు నడుపుతున్నామని పేర్కొన్నారు.

Similar News

News September 13, 2025

కరీంనగర్: LMD రిజర్వాయర్‌లో వెరైటీ చేప..!

image

KNR జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీకి చెందిన మత్స్యకారుడు బోళ్ల భూమయ్య రోజూలాగే చేపలు పట్టేందుకు శనివారం ఉదయం ఎల్ఎండీ రిజర్వాయర్‌కి వెళ్లాడు. ఈ క్రమంలో వలలు తీస్తుండగా ఎర్రరంగులో ఉన్న వెరైటీ భారీ చేప అతడి కంటపడింది. కాగా, ఇలాంటి చేప ఇప్పటివరకు LMD రిజర్వాయర్‌లో లభించలేదని మత్స్యకారులు తెలిపారు. దీనిని ఉత్తర ప్రదేశ్‌కు చెందిన చేపగా పలువురు చెబుతున్నారు. స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

News September 13, 2025

మహిళల్లోనే ఎక్కువగా కంటి సమస్యలు

image

పురుషులతో పోలిస్తే మహిళల్లోనే కంటి సంబంధిత సమస్యలు ఎక్కువని యునైటెడ్ స్టేట్స్ సెన్సస్ బ్యూరో అధ్యయనం వెల్లడించింది. హార్మోన్ సమస్యలు, ప్రెగ్నెన్సీలో శరీరంలో నీటి పరిమాణం పెరిగి కార్నియా మందంగా మారడం, డయాబెటిక్ రెటినోపతి వల్ల కళ్లలోని రక్తనాళాలు దెబ్బతినడం వల్ల కంటి సమస్యలు వస్తున్నాయి. అలాగే మెనోపాజ్ సమయంలో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గడం కూడా కంటి సమస్యలకు మరో కారణమని పరిశోధకులు వెల్లడించారు.

News September 13, 2025

జగన్ గోడ మీద పిల్లి వైఖరిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు: అనగాని

image

AP: అమరావతిపై YCP నేతలు మళ్లీ నాటకాలు మొదలుపెట్టారని మంత్రి అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు. ‘రాజధాని విషయంలో 3ముక్కలాట ఆడిన జగన్‌ను ప్రజలు 11సీట్లకే పరిమితం చేశారు. రాజధాని నిర్మాణం అక్కర్లేదంటూనే GNT – VJA మధ్య <<17688305>>రాజధాని నిర్మిస్తామని<<>> చెబుతున్న YCP నేతల కబుర్లు నమ్మడానికి సిద్ధంగా లేరు. రాజధానిపై జగన్ గోడ మీద పిల్లి వైఖరిని జనం గమనిస్తూనే ఉన్నారు’ అని ట్వీట్ చేశారు.