News February 16, 2025

కరీంనగర్: మహాశివరాత్రికి ప్రత్యేక బస్సులు

image

మహా శివరాత్రి పురస్కరించుకొని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి పుణ్య క్షేత్రానికి KNR, ఆదిలాబాద్, WGL, NZB రీజియన్లలోని వివిధ డిపోల నుంచి ఈ నెల 25 నుంచి 27 వరకు 778 అదనపు బస్సులు నడుపుతున్నామని KNR RM బి.రాజు ఒక ప్రకటనలో తెలిపారు. వేములవాడతో పాటు ఉమ్మడి KNR జిల్లాలోని వివిధ శైవ క్షేత్రాలకు, భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం శైవ క్షేత్రానికి కూడా అదనపు బస్సులు నడుపుతున్నామని పేర్కొన్నారు.

Similar News

News January 11, 2026

నాగోబా ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కృషి: వెడ్మ బొజ్జు

image

ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని ప్రఖ్యాత నాగోబా ఆలయాన్ని శనివారం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ దర్శించుకున్నారు. స్థానికంగా నిర్వహించే జాతర ఏర్పాట్లను పరిశీలించారు. ప్రఖ్యాత నాగోబా ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం మరింత కృషి చేస్తుందన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి సమస్యలు లేకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.

News January 11, 2026

రాజమండ్రి: ఈ నెల 13నుంచి జిల్లా స్థాయి సంప్రదాయ క్రీడా పోటీలు

image

సంక్రాంతి పండగను పురస్కరించుకుని జిల్లా స్థాయి సంప్రదాయ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా సాధికార అధికారి డీఎమ్‌ఎమ్ శేషగిరి నేడు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజల్లో సాంస్కృతిక వారసత్వంపై అవగాహనతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపింది.ఈ పోటీలు 13వ తేదీ నుంచి ఎస్.కె.వి.టి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరగనున్నాయన్నారు.

News January 11, 2026

సంగారెడ్డి: ఈనెల 12న ప్రజావాణి రద్దు: కలెక్టర్

image

సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ప్రతివారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం ఈనెల 12న రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు, ఇతర ముఖ్యమైన కార్యకలాపాలలో జిల్లా అధికారులు నిమగ్నమై ఉన్నారని, ఈ సందర్భంగా ప్రజావాణి రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని సూచించారు.