News February 16, 2025

MPTC, ZPTC ఎన్నికలు: రంగారెడ్డి జిల్లా UPDATES

image

రంగారెడ్డి జిల్లా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు-2025కు సంబంధించిన తుది పోలింగ్ కేంద్రాల జాబితాను జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి శనివారం విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 21 మండలాలు ఉన్నాయి. 1,358 పోలింగ్ కేంద్రాలను ఫైనల్ చేశారు. మొత్తం 232 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 7,63,603 ఓటర్లు ఉన్నారు.

Similar News

News March 14, 2025

HYD: హోలీ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత: సీపీ

image

35 ఏళ్ల తర్వాత ఒకే రోజు హోలీ, రంజాన్ మాసంలో రెండవ శుక్రవారం ఒకేరోజు రావడంతో HYD సీపీ సీవీ ఆనంద్ అధికారులను అప్రమత్తం చేశారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. ప్రతీ జోన్, సున్నితమైన  ప్రాంతాల్లో పికెట్‌లు ఏర్పాటు చేయాలని, అసాంఘిక శక్తులపై కట్టుదిట్టమైన నిఘా పెట్టాలని అధికారులకు ఆదేశించారు. అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్, డీసీపీ చైతన్య కుమార్ పాల్గొన్నారు. 

News March 14, 2025

జిల్లాలో కొనసాగుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు

image

రంగారెడ్డి జిల్లాలో ఎండ మండిపోతుంది. గురువారం కొత్తూర్, చందనవెల్లిలో 39.8℃, షాబాద్, మహేశ్వరం, ప్రొద్దుటూరు 39.7, మహంకాళ్, రెడ్డిపల్లె 39.6, చుక్కాపూర్, కేతిరెడ్డిపల్లి 39.5, తాళ్లపల్లి 39.4, మణికొండ 39.3, మొగల్గిద్ద, తోమ్మిడిరేకుల, మంగళ్‌పల్లి 39.3, పెద్దఅంబర్‌పేట్, మొయినాబాద్, మామిడిపల్లె, అబ్దుల్లాపూర్‌మెట్, తట్టిఅన్నారం 39.2, ధర్మసాగర్, ఆరుట్లలో 39.1℃ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

News March 13, 2025

రంగారెడ్డి జిల్లాలో పెరుగుతున్న ఎండ తీవ్రత

image

రంగారెడ్డి జిల్లాలో ఎండ తీవ్రత పెరుగుతోంది. బుధవారం మోయినాబాద్లో 39.7℃, మొగల్గిద్ద, కేతిరెడ్డిపల్లె, మంగళపల్లె 39.5, ప్రొద్దుటూరు 39.3, రెడ్డిపల్లె 39.2, షాబాద్, కాసులాబాద్ 39.1, చుక్కాపూర్ 39, మహేశ్వరం, నాగోల్ 38.6, హస్తినాపురం 38.5, మామిడిపల్లె, తుర్కయంజాల్, తొమ్మిదిరేకుల 38.5, కోతూర్, హఫీజ్‌పేట్ 38.4, చంపాపేట్ 38.3, శంకర్‌పల్లి 38.3, ఖాజాగూడ, మహంకాళ్, అలకాపురి 38.2℃ ఉష్ణోగ్రత నమోదైంది.

error: Content is protected !!