News February 16, 2025

కర్నూలు, ఆదోనిలో ఎండు మిర్చి ధరల వివరాలు

image

కర్నూలు, ఆదోని వ్యవసాయ మార్కెట్లలో శనివారం శనివారం ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఆదోని వ్యవసాయ మార్కెట్లో క్వింటా గరిష్ఠ ధర రూ.13,236 పలకగా.. కనిష్ఠ ధర రూ.2,200 పలికింది. కర్నూల్లో కనిష్ఠంగా రూ.3,500 పలకగా.. గరిష్ఠంగా రూ.12,813 పలికినట్లు ఆయా మార్కెట్ల ఎంపిక శ్రేణి అధికారులు తెలిపారు.

Similar News

News September 18, 2025

SE, DEలతో NPDCL సీఎండీ వీడియో కాన్ఫరెన్స్

image

హనుమకొండలోని ఎన్పీడీసీఎల్ కార్యాలయం నుంచి సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 16 సర్కిళ్ల ఎస్ఈ, డీఈలతో సమీక్షించి, ట్రాన్స్‌ఫార్మర్ల డిజిటలైజేషన్‌ను వేగవంతం చేయాలని ఆదేశించారు. ట్రాన్స్‌ఫార్మర్లపై ఉన్న సర్వీసులను మ్యాపింగ్ చేయాలని ఆయన అధికారులకు సూచించారు. సంస్థ కార్యకలాపాలను మెరుగుపరచడానికి ఈ చర్యలు తోడ్పడతాయని తెలిపారు.

News September 18, 2025

PDPL: ప్రీ- ప్రైమరీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

పెద్దపల్లి జిల్లాలో కొత్తగా ప్రారంభించనున్న 12 ప్రీ- ప్రైమరీ పాఠశాలల్లో ఇన్‌స్ట్రక్టర్లుగా, ఆయాలుగా తాత్కాలిక పద్ధతిన పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి బుధవారం తెలిపారు. ఇందుకు సెప్టెంబర్ 21లోపు అవకాశం ఉందన్నారు. ఇంటర్, 7వ తరగతి విద్యార్హతలతో 18- 44ఏళ్ల మధ్య వయస్సున్నవారు సంబంధిత HMలకు దరఖాస్తులు సమర్పించాలన్నారు. ఎంపికలో స్థానికులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు.

News September 18, 2025

మహబూబాబాద్: ఐదుగురు పీఏసీఎస్ ఛైర్మన్‌‌లను తొలగించిన ప్రభుత్వం

image

మహబూబాబాద్ జిల్లాలో ఐదుగురు పీఏసీఎస్ ఛైర్మన్లను ప్రభుత్వం తొలగించింది. తొర్రూరు, నెల్లికుదురు, బయ్యారం, కేసముద్రం, కురవి సొసైటీల ఛైర్మన్లను తొలగించి, వారి స్థానంలో ప్రత్యేక అధికారులను నియమించింది. తొర్రూరుకు రమేశ్, బయ్యారానికి ఆదినారాయణ, నెల్లికుదురుకు మోహన్ రావు, కేసముద్రానికి ప్రవీణ్, కురవికి సుమలత ప్రత్యేక అధికారులుగా బాధ్యతలు స్వీకరించారు.