News February 16, 2025
NLG: 75 మందికి కౌన్సెలింగ్.. పోస్టింగ్ ఆర్డర్లు

2008 డీఎస్సీలో నష్టపోయిన బీఈడీ అభ్యర్థులకు కాంట్రాక్టు పద్ధతిన ఉద్యోగాలు ఇచ్చేందుకు విద్యాశాఖ ఆదేశాలు ఇవ్వడంతో డీఈఓ బిక్షపతి శనివారం కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఆర్డర్లు అందజేశారు. జిల్లాలో 75 మంది అభ్యర్థులకు శనివారం డీఈఓ కార్యాలయంలో నియామక ఉత్తర్వులు అందజేశారు. వీరికి ప్రతి నెల రూ.31,040 వేతనం ఇవ్వనున్నారు.
Similar News
News March 14, 2025
నల్గొండ: మోదుగ పువ్వు.. చరిత్ర ఇదే..!

మోదుగ ఒక ఎర్రని పువ్వు. ఈ పువ్వులను అగ్నిపూలు అని పిలుస్తారు. ఇది ఫాబేసి కుటుంబంలో బుటియాప్ర జాతికి చెందిన పుష్పించే మొక్క. దీని శాస్త్రీయ నామం బుటియా మోనోస్పెర్మా. ఇది ఒక పెద్ద చెట్టులాగా పెరుగుతుంది. అందమైన ఎర్రని పూలు గుత్తులు గుత్తులుగా అందంగా పూస్తాయి. మోదుగ చెట్టును కింశుక వృక్షం అని కూడా అంటారు. ఈ పువ్వులు హొలీ పండగ సమయంలో వేపుగా పూస్తాయి.
News March 14, 2025
నల్గొండ: శిశు మరణాలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

శిశు మరణాలు లేని జిల్లాగా నల్గొండను తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ కోరారు. గురువారం ఆమె ఉదయాదిత్య భవన్లో మిర్యాలగూడ డివిజన్ పరిధిలో శిశు మరణాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. ప్రసవానంతరం వివిధ కారణాలవల్ల శిశువులు చనిపోవడాన్ని తగ్గించాలని, ఇందుకు వైద్య ఆరోగ్యశాఖతోపాటు, మహిళా, శిశు సంక్షేమ శాఖల అధికారులు, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.
News March 14, 2025
నల్గొండ: ఇంటర్ పరీక్షలు.. 601మంది డుమ్మా..!

నల్గొండ జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు కొనసాగుతున్నాయని డీఐఈఓ దస్రు నాయక్ తెలిపారు. గురువారం జరిగిన ప్రథమ సంవత్సరం గణితం బీ, జువాలజీ, హిస్టరీ పరీక్షలు జరిగాయని చెప్పారు. ఈ పరీక్షలకు 13వేల 772 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా.. 13వేల 171 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. 601 విద్యార్థులు పరీక్షకు గైరాజరయ్యారని తెలిపారు.