News February 16, 2025
ముధోల్: కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు మృతి

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు నాగేష్ శాస్త్రి HYDలోని ఆసుపత్రిలో అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మాజీ మంత్రి, దివంగత నేత గడ్డేన్నకు శిష్యుడిగా పేరొందారు. ఆదివారం ఉదయం 11గంటలకు స్వగ్రామం ముధోల్లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
Similar News
News March 14, 2025
HEADLINES

* TG: డీలిమిటేషన్ పేరిట దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం కుట్ర: CM రేవంత్
* అసెంబ్లీ స్పీకర్పై వివాదాస్పద వ్యాఖ్యలు.. సభ నుంచి జగదీశ్ రెడ్డి సస్పెండ్
* కేసీఆర్ తెలంగాణను దోచుకున్నారు: MLC విజయశాంతి
* మా వల్లే గతంలో కాంగ్రెస్ ఉచిత కరెంట్ ఇచ్చింది: CM చంద్రబాబు
* వచ్చే ఏడాది నుంచి FEB చివర్లోనే ఇంటర్ పరీక్షలు: లోకేశ్
* AP, TGలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవం
News March 14, 2025
WPL: ఫైనల్లో ముంబై

గుజరాత్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచులో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. MI ముందుగా బ్యాటింగ్ చేయగా మాథ్యూస్(77), స్కివర్ బ్రంట్(77) విధ్వంసంతో 213 పరుగులు చేసింది. ఛేదనలో గుజరాత్ కనీస పోటీని ఇవ్వలేకపోయింది. క్రమం తప్పకుండా వికెట్లు పడటంతో 19.2 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో గిబ్సన్(34)దే అత్యధిక స్కోరు. దీంతో ముంబై ఫైనల్ చేరింది. ఈ నెల 15న ఢిల్లీతో ట్రోఫీ కోసం పోటీ పడనుంది.
News March 14, 2025
హోలీ.. రేపు ‘బ్లడ్ మూన్’

రంగుల పండుగ హోలీ వేళ రేపు ఆకాశంలో అద్భుతం చోటు చేసుకోనుంది. సూర్యుడికి చంద్రుడికి మధ్య భూమి అడ్డుగా వచ్చి చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఫలితంగా భూమి వాతావరణంలో నుంచి చంద్రుడిపైకి సూర్యకిరణాలు ప్రసరించి జాబిల్లి ఎర్రగా మారనుంది. దీన్నే ‘బ్లడ్ మూన్గా పిలుస్తారు. కానీ ఇది భారత్లో కనిపించదు. యూరప్ దేశాలతో పాటు సౌత్, నార్త్ అమెరికా, వెస్ట్రన్ ఆఫ్రికా దేశాల్లో బ్లడ్ మూన్ 65 నిమిషాల పాటు కనువిందు చేయనుంది.