News February 16, 2025

పెందుర్తి: వరుసకు బాబాయ్.. అయినా పాడుబుద్ధి..!

image

వరుసకు బాబాయ్ అయిన వ్యక్తి లైంగికంగా తనను వేధిస్తున్నాడంటూ 2023లో పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో ఓ యువతి పెబ్బిలి రవికుమార్‌పై ఫిర్యాదు చేసింది. వెంటనే అతను హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నాడు. అయితే ఇటీవల పెందుర్తి పోలీసులు రిట్ పిటిషన్ వెయ్యగా బెయిల్‌ రద్దవ్వడంతో అతనిని శనివారం అరెస్టు చేసినట్లు ఏసీపీ సాయి పృథ్వీ తేజ తెలిపారు. రవికుమార్ ప్రస్తుతం ఏపీ బీసీ సమైక్య అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. 

Similar News

News September 15, 2025

విశాఖ డాగ్ స్క్వాడ్.. నేర నియంత్రణలో కీలకం

image

విశాఖ నగర పోలీస్ డాగ్ స్క్వాడ్‌లో 18 శునకాలు నేర నియంత్రణలో పాలుపంచుకుంటున్నాయి. వీటిలో 10 నార్కోటిక్, 6 ఎక్స్‌ప్లోజివ్, 2 ట్రాకర్ డాగ్స్ ఉన్నాయి. ఇటీవల రైల్వే స్టేషన్ పరిధిలో ఈ జాగిలాలు 41 కిలోల గంజాయిని పట్టుకున్నాయి. జిల్లా కలెక్టర్, జీవీఎంసీ సహకారంతో కొత్తగా 8 నార్కోటిక్ శునకాలు, నూతన కెన్నెల్స్ స్క్వాడ్‌లో చేరాయి. వీటికి క్రమం తప్పకుండా వ్యాక్సినేషన్ అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

News September 15, 2025

విశాఖ: ‘వీకెండ్‌లో స్విగ్గీ, జోమోటో రైడర్ల సమ్మె’

image

విశాఖలో స్విగ్గీ, జోమోటో రైడర్లు ప్రతి శని, ఆదివారాల్లో సమ్మె చేయాలని తీర్మానించారు. జగదాంబలో సీఐటీయూ కార్యాలయంలో రైడర్ల సమావేశం జరిగింది.‌ జోమాటో యాజమాన్యం ఇచ్చిన హామీలను అమలు చేస్తుందో? లేదో? చూస్తామని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కుమార్ అన్నారు. స్విగ్గీ యాజమాన్యం చర్చలకు రాలేదని తెలిపారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగుతుందన్నారు.

News September 15, 2025

విశాఖలో పర్యటించనున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్

image

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 17న విశాఖలో పర్యటించనున్నారు. 16న రాత్రి ఆమె విశాఖ చేరుకుని ప్రైవేటు రిసార్ట్‌లో బస చేస్తారు. 17న ఉదయం 10 గంటలకు ప్రైవేటు కన్వెన్షన్ సెంటర్లో జిఎస్టి సంస్కరణలపై ఔట్ రీచ్ ప్రోగ్రాంలో పాల్గొంటారు. 12 గంటలకు స్వస్థ నారీ కార్యక్రమంలో వర్చువల్‌గా ప్రసంగిస్తారు.‌ 3 గంటలకు జీసీసీ బిజినెస్ సమ్మిట్‌లో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్తారు.