News February 16, 2025
MPTC, ZPTC ఎన్నికలు: హనుమకొండ జిల్లా UPDATES

హనుమకొండ జిల్లా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు-2025కు సంబంధించిన పోలింగ్ కేంద్రాల జాబితాను అధికారులు విడుదల చేశారు. జిల్లాలో 12 ZPTC స్థానాలు ఉన్నాయి. 631 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 129 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. హన్మకొండ జిల్లాలో మొత్తం 3,72,646 మంది ఓటర్లు ఉన్నారు.
Similar News
News April 16, 2026
ప.గో: నకిలీ సిఫారసు లేఖలతో వెలుగు చూసిన మోసం

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశలు చూపి కొందరు కేటుగాళ్లు నిరుద్యోగులను బురిడీ కొట్టిస్తున్నారు. అత్తిలి మండలం ఆరవల్లిలో కొందరు ఈ దందాకు తెరలేపిన వైనం వెలుగు చూసింది. సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరుతో సిఫార్సు లేఖలు తయారు చేసి నిరుద్యోగులకు ఎరవేశారు. కేవలం అత్తిలి మండలంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా సుమారు 50 మంది నుంచి రూ.3 కోట్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం.
News April 16, 2026
మెళియాపుట్టి: భార్యను చంపిన కేసులో భర్తకు జీవిత ఖైదు

భార్యను నాటు తుపాకీతో చంపిన కేసులో భర్తకు జీవిత ఖైదు విధిస్తూ గురువారం సోంపేట అదనపు జడ్జి కె.కిషోర్ బాబు తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి తెలిపారు. మెళియాపుట్టి మండలం భరణికోట గ్రామానికి చెందిన సవర పద్మ అనే మహిళను ఆమె భర్త జగ్గారావు 2021 అక్టోబర్ 21న నాటు తుపాకీతో కాల్చి చంపాడు. అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. నేరం రుజువు కావడంతో శిక్ష విధించినట్లు తెలిపారు.
News April 16, 2026
భీమవరం: రెడ్క్రాస్కు రూ.8.50 లక్షల విరాళం

జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవా కార్యక్రమాల కోసం రూ.8.50 లక్షల నిధులు సేకరించడం అభినందనీయమని కలెక్టర్ నాగరాణి పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ మొత్తానికి సంబంధించిన మోడల్ చెక్కును రెడ్క్రాస్ ఛైర్మన్ భద్రిరాజు కలెక్టర్ సమక్షంలో అందజేశారు. మానవతా దృక్పథంతో విద్యాశాఖ చేసిన ఈ కృషిని కలెక్టర్ కొనియాడారు.


