News March 20, 2024
మదనపల్లె: పిల్లలు పుట్టలేదని విషం తాగిన దంపతులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1710938017504-normal-WIFI.webp)
బి కొత్తకోటలో విషం తాగి దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసుల కథనం.. స్థానిక రంగసముద్రం రోడ్డులో ఉంటున్న దంపతులు బాలాజీ, అశ్వినికి 9 ఏళ్లగా పిల్లలు కలగలేదు. దీంతో వారు బుధవారం గొడవపడ్డారు. మనస్థాపం చెందిన అశ్విని పురుగుమందు తాగడంతో గమనించిన భర్త ఆవెంటనే పురుగు మందుతాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. బాధితులను కుటుంబీకులు చికిత్సకోసం వెంటనే మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు.
Similar News
News July 8, 2024
స్విమ్స్లో డిగ్రీ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720436154870-normal-WIFI.webp)
తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్) యూనివర్సిటీ డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా జులై 22వ తేదీ లోగా దరఖాస్తులను సమర్పించాలని కోరింది.
News July 8, 2024
తిరుపతి: ఫుడ్ కోర్ట్ ప్రారంభించిన ఎస్పీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720421120473-normal-WIFI.webp)
పోలీస్ పెరేడ్ మైదానంలో జిల్లాస్థాయి దళం కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన నూతన ఫుడ్ కోర్టును ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రారంభించారు. విధినిర్వహణలో ఉండి ఇళ్లకు వెళ్లి భోజనాలు చేయలేని సిబ్బంది కోసం దీనిని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఎటువంటి లాభాపేక్షా లేకుండా, తక్కువ ధరకే ఆహార పదార్థాలు సిబ్బందికి అందుబాటులో ఉంటాయని తెలియజేశారు. అడిషనల్ ఎస్పీలు వెంకట్రావు, కులశేఖర్ విమల కుమారి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
News July 8, 2024
పుంగనూరు: న్యాయ విభాగం ఏర్పాటు చేసిన పెద్దిరెడ్డి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720416685517-normal-WIFI.webp)
వైసీపీ శ్రేణులపై టీడీపీ నాయకులు దాడి చేస్తున్న నేపథ్యంలో వారికి అండగా ఉండేలా పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి న్యాయ విభాగం ఏర్పాటు చేసినట్టు ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకోసం నలుగురు లాయర్లను నియమించినట్లు ఆయన పేర్కొన్నారు. దాడులను అడ్డుకుంటే.. తిరిగి వైసీపీ నాయకులపై కేసులు నమోదు చేయడం దారుణమని వెల్లడించారు.