News February 16, 2025

సంచలనం: ఇండియా ఎన్నికల్లో అమెరికా జోక్యం!

image

అమెరికాలో ఎలాన్ మస్క్ నేతృత్వంలోని DOGE శాఖ సంచలన విషయాలు బయటపెట్టింది. ఇండియాలో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అమెరికా ప్రభుత్వం 21 మిలియన్ డాలర్ల ట్యాక్స్ పేయర్ల డబ్బును వెచ్చించాలని ప్రతిపాదించింది. దీంతో పాటు ఇతర దేశాలకూ ప్రపోజ్ చేసిన నిధులను క్యాన్సిల్ చేసినట్లు వెల్లడించింది. అయితే మన దేశ ఎన్నికల్లో విదేశీ జోక్యం బయటపడటంతో దీనిపై మోదీ సర్కార్ విచారణ జరిపించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Similar News

News October 18, 2025

ప్రశాంతమైన నిద్ర కోసం టిప్స్

image

*రాత్రిపూట మద్యం తాగితే మంచి నిద్ర పడుతుందనేది అపోహే. మొదట్లో మత్తుగా ఉన్నా, ఆ తర్వాత నిద్రకు ఆటంకం కలుగుతుంది.
*రాత్రి పడుకోవడానికి గంట ముందు పాలు తాగాలి. అవకాడో, అరటి తినాలి.
*వెలుతురు లేని గదిలో పడుకోవాలి. బెడ్ లైట్ లేకుండా నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి.
>నిద్ర సరిగా లేకుంటే దీర్ఘకాలంలో గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

News October 18, 2025

5 జిల్లాల్లో ₹7910 కోట్లతో చురుగ్గా జలజీవన్ పనులు

image

AP: 5 జిల్లాల్లో ₹7910 కోట్లతో జలజీవన్ పథకం పనుల్ని ప్రభుత్వం చురుగ్గా సాగిస్తోంది. ఈ పథకం నిధులు మురిగిపోయే పరిస్థితి రాగా మరో 4 ఏళ్లు పొడిగించేలా కూటమి సర్కారు కేంద్రాన్ని ఒప్పించి మళ్లీ పనులకు శ్రీకారం చుట్టించింది. ఇవి పూర్తయితే 1.22 కోట్ల మందికి రక్షిత నీరందుతుంది. ఫ్లోరైడ్ సమస్య ఉన్న పశ్చిమ ప్రకాశంలో ₹1290కోట్లతో పనులు చేస్తున్నారు. చిత్తూరు, గుంటూరు, గోదావరి జిల్లాల్లో కొన్ని పూర్తయ్యాయి.

News October 18, 2025

న్యాయవ్యవస్థలు దిగొస్తాయని నమ్ముతున్నాం: ఆర్.కృష్ణయ్య

image

TG: రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం నిర్వహించిన బంద్ విజయవంతమైందని బీసీ జేఏసీ ఛైర్మన్, ఎంపీ ఆర్.కృష్ణయ్య చెప్పారు. బీసీల డిమాండ్ న్యాయమని భావించి మద్దతిచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. రిజర్వేషన్ల విషయంలో న్యాయవ్యవస్థలు దిగివస్తాయని నమ్ముతున్నామని పేర్కొన్నారు. బీసీ కులాల గౌరవం, పేదరిక నిర్మూలన కోసం తాము పోరాటం చేస్తున్నామని అన్నారు.