News February 16, 2025
ఖమ్మం: మృతదేహం లభ్యం.. హత్య? ఆత్మహత్య?

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం- మేడిదపల్లి గ్రామాల మధ్యలో ఉన్న కాల్వకట్ట పక్కన గుర్తు తెలియని మృతదేహం లభ్యమవడం స్థానికంగా కలకలం రేపింది. మృతదేహాన్ని చూసిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకొని, దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య?.. లేదా హత్య?.. అనే కోణంలో విచారిస్తున్నారు. మృతుడు పాతర్లపాడుకు చెందిన కొల్ల సైదులుగా గుర్తించారు.
Similar News
News November 7, 2025
వరంగల్లో MRPS ఉమ్మడి జిల్లా కార్యవర్గ సమావేశం

వరంగల్లో ఈరోజు ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల కార్యవర్గ ఉమ్మడి జిల్లా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి ఎమ్మార్పీఎస్ జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు హాజరయ్యారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 11వ తేదీన నిర్వహించబోయే చలో ఢిల్లీ కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరుకావాలని నేతలు కోరారు.
News November 7, 2025
వర్ధన్నపేట: వడ్లు ఆరబెట్టే యంత్రాలను రైతులు వినియోగించుకోవాలి: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన డ్రై హెడ్ మిషన్ (వడ్లు అరబెట్టే యంత్రం)లను రైతులు వినియోగించుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి సూచించారు. వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ను శుక్రవారం కలెక్టర్ సందర్శించారు. యంత్రాల ద్వారా వడ్లను ఎలా ఆరబెట్టుకోవాలో రైతులకు అవగాహన కల్పించి, ఆధునిక పద్ధతులపై సూచనలు చేశారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ నరకుడు వెంకటయ్య, స్థానిక అధికారులు తదితరులు ఉన్నారు.
News November 7, 2025
‘జర్నలిస్టుపై వైసీపీ నేత అనుచరుల దాడి’

సుండుపల్లె మండలం రాచంవాండ్ల పల్లెకు చెందిన జర్నలిస్టు వల్లెపు శ్రీరాములుపై వైసీపీ నేత ఆనంద్ రెడ్డి అనుచరులు శుక్రవారం దాడి చేసినట్లు బాధితుడు ఆరోపించాడు. అనుంపల్లి అటవీ ప్రాంతంలో బైక్ను అడ్డగించి రాడ్లు, కర్రలతో కొట్టినట్లు తెలిపాడు. భూ వివాదంపై కలెక్టర్కు ఫిర్యాదు చేసినందుకు ప్రతీకారంగా దాడి చేసినట్లు వాపోయాడు. ఈ ఘటనపై రాయచోటి ఎస్ఐ బాలకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారన్నాడు
.


