News March 20, 2024

కామారెడ్డి: మహిళ టీచర్‌కు షోకాజ్ నోటీస్ 

image

ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన బిచ్కుంద మండల ప్రజా పరిషత్ పాఠశాల సెకండరి గ్రేడ్ ఉపాధ్యాయురాలు కృష్ణవేణికి ఫైనల్ షోకాజ్ నోటిస్ జారీ చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి రాజు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. నవంబర్ 2, 2022 నుంచి ముందస్తు అనుమతులు లేకుండా విధులకు రావడం లేదని, 10 రోజుల్లోగా సమాధానం రాకపోతే సర్వీస్ నుంచి తొలగిస్తామని ఆయన పేర్కొన్నారు.

Similar News

News March 23, 2026

నిజామాబాద్: మూడు నెలల రేషన్ ఒకేసారి!

image

ఎండల తీవ్రత దృష్ట్యా రేషన్ లబ్ధిదారులకు పౌరసరఫరాల శాఖ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన మూడు నెలల కోటా బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వేసవిలో ప్రతి నెలా కార్డుదారులు ఎండలో వరుస కట్టాల్సిన ఇబ్బందులు కలగకుండా ఈ వెసులుబాటు కల్పించారు.
​ఇందుకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలోని సుమారు 15,94,782 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది.

News March 22, 2026

నిజామాబాద్: భగ్గుమంటున్న మాంసం ధరలు

image

నిజామాబాద్ జిల్లాలో మాంసం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. చికెన్ విత్ స్కిన్ కిలో రూ.320, స్కిన్‌లెస్ రూ.358కి చేరింది. మటన్ ధరలు సైతం పైపైకి వెళ్తున్నాయి. సాధారణ మేక మాంసం రూ.500-600 పలుకుతుండగా, పొట్టేలు మాంసం రూ.800 నుంచ రూ.900 వరకు విక్రయిస్తున్నారు. వేసవి ఎండల ప్రభావం, శుభకార్యాల వల్ల పెరిగిన డిమాండ్‌తో ధరలు భారీగా పెరగడంతో మాంసాహార ప్రియులు బెంబేలెత్తిపోతున్నారు.

News March 22, 2026

NZB: నేడు ప్రపంచ జల దినోత్సవం.. మీరేం చేయాలంటే?

image

“నీరు లేనిదే జీవం లేదు.. నీటిని పొదుపుగా వాడటం మనందరి బాధ్యత” అనే నినాదంతో నేడు ప్రపంచ జల దినోత్సవం నిర్వహించనున్నారు. కురుస్తున్న వర్షాలు, ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ వంటి పథకాల వల్ల జిల్లాలో భూగర్భ జలాలు గతంలో కంటే కొంత మెరుగయ్యాయి. అయినప్పటికీ “ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడడంతో పాటు తమ ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతను నిర్మించుకోవడం, బావులను, చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’.