News February 16, 2025
యాదాద్రి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు వేళాయే!

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 1 నుంచి 11వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. 1న విశ్వక్సేన ఆరాధనతో ప్రారంభం కాగా 2న ధ్వజారోహణ, అగ్ని ప్రతిష్ఠాపన, 3 నుంచి అలంకరణ సేవలు, 7న స్వామివారి ఎదుర్కోళ్ల మహోత్సవం, 8న తిరు కళ్యాణ మహోత్సవం, 9న దివ్య విమాన రథోత్సవం, 10న చక్ర తీర్థం, 11న శతఘటాభిషేకంతో ఉత్సవాలు ముగుస్తాయి.
Similar News
News September 16, 2025
గుండెపోటుతో డోన్ ఆర్పీఎఫ్ ఎస్ఐ మృతి

డోన్ రైల్వే స్టేషన్లో విషాదం నెలకొంది. ఆర్పీఎఫ్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న లక్ష్మణ్ నాయక్ గుండెపోటుతో మృతిచెందారు. సామాజిక సేవలోనూ ముందుండే లక్ష్మణ్ నాయక్ మరణ వార్త కుటుంబ సభ్యులు, సహచరులు, స్నేహితులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తోటి సిబ్బంది విచారం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News September 16, 2025
WNP: ‘యాత్ర దానం’ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

టీజీఎస్ ఆర్టీసీ సామాజిక బాధ్యతలో భాగంగా ప్రారంభించిన ‘యాత్ర దానం’ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో గోడపత్రికను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. నిరాశ్రయులు, వృద్ధులు, దివ్యాంగులు, పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారు బస్సులను బుక్ చేసుకుని ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డీఎం వేణుగోపాల్ పాల్గొన్నారు.
News September 16, 2025
హుస్నాబాద్: రజకుల సమస్యలు పరిష్కరిస్తాం: మంత్రి పొన్నం

రజక వృత్తిదారుల సమస్యలు CM దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం సచివాలయంలోని మంత్రి ఛాంబర్లో ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో రజక అభివృద్ధి దారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కుల వృత్తులపై ఆధారపడే బలహీన వర్గాలు మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. బీసీ సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.