News March 20, 2024
సంగారెడ్డి: ‘మార్చి 28 లోగా ఆ నిధులు ఖర్చు చేయాలి’
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1710932094267-normal-WIFI.webp)
జిల్లాలోని అన్ని ప్రభుత్వ, కేజీబీవీ పాఠశాలలకు ప్రభుత్వం విడుదల చేసిన నిధులన్నీ మార్చి 28వ తేదీ లోపల డ్రా చేసి ఖర్చు చేయాలని లేనిచో నిధులన్నీ వెనక్కి వెళ్తాయని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలిపారు. అదేవిధంగా దీనికి సంబందించిన యూసీలను సిద్దం చేసుకోవాలని సూచించారు.
Similar News
News July 5, 2024
గజ్వేల్: యువకుడి ఆత్మహత్య
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720184193196-normal-WIFI.webp)
యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన గజ్వేల్ నియోజకవర్గంలో జరిగింది. స్థానికులు వివరాలు.. ఎల్కల్ గ్రామానికి చెందిన మంది రాజు (35) శుక్రవారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు అక్కడికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News July 5, 2024
మెదక్: ‘ట్రాక్టర్ కేజీ వీల్స్ రోడ్లపైకి వస్తే చర్యలు’
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720171331344-normal-WIFI.webp)
జిల్లాలో ట్రాక్టర్లను కేజీ వీల్స్తో బీటీ రోడ్లు, సీసీ రోడ్లపై నడపడం వల్ల దెబ్బతింటున్నాయని, కేజీ వీల్స్తో ట్రాక్టర్లను రోడ్లపై నడిపిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని జిల్లా ఎస్పీ డాక్టర్ బాలస్వామి హెచ్చరించారు. ఎస్పీ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ప్రభుత్వం ఎంతో వ్యయంతో ప్రజలకు మెరుగైన సుఖవంతమైన ప్రయాణం కోసం రోడ్లను ఏర్పాటు చేసిందని, కేజీ వీల్స్తో రోడ్లు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు.
News July 5, 2024
మెదక్: సదరం క్యాంప్ తేదీలు విడుదల
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720164558003-normal-WIFI.webp)
మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వికలాంగులను గుర్తించి అర్హతగల వారికి సదరం ధ్రువీకరణ పత్రం పొందేందుకుగానూ జులై -2024 సంబందించిన క్యాంప్ తేదీలను మీ సేవ / ఈ సేవ కేంద్రాలకు కేటాయించినట్లు డీఆర్డీఓ శ్రీనివాస్ రావు తెలిపారు. దివ్యాంగులు తమ దగ్గరలో ఉన్న మీ సేవ/ ఈ సేవ కేంద్రం వద్ద ఆన్ లైన్లో స్లాటు బుక్ చేసుకొని కేటాయించిన రోజు ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు.