News February 16, 2025

యాగం చేసిన అనకాపల్లి ఎంపీ 

image

లోక కల్యాణార్థం సుదర్శన లక్ష్మీనరసింహ, లక్ష్మీ గణపతి, మృత్యుంజయ యాగం, మహా శాంతి హోమం నిర్వహించినట్లు అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని తమ నివాసంలో కుటుంబ సమేతంగా వీటిని నిర్వహించామన్నారు. కేంద్రం, రాష్ట్రంలోనూ ప్రజా సంక్షేమ ప్రభుత్వాలు వర్ధిల్లాలని.. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే శక్తిని ప్రసాదించాలని కోరుతూ ఈ యాగం చేశామన్నారు.

Similar News

News July 7, 2025

అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్‌కు ప్రభుత్వం ఆమోదం

image

AP: అమరావతి <<16882676>>క్వాంటమ్ వ్యాలీ<<>> డిక్లరేషన్‌ను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2035 నాటికి అమరావతిని ప్రపంచ క్వాంటమ్ కేంద్రంగా అభివృద్ధి చేయడమే దీని లక్ష్యమని తెలిపింది. దేశంలోనే అతిపెద్ద క్వాంటమ్ బెడ్‌గా క్వూ-చిప్-ఇన్‌ను వచ్చే 12 నెలల్లో ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. 2026లో ప్రారంభమయ్యే అమరావతి క్వాంటమ్ అకాడమీ ద్వారా శిక్షణ, ఫెలోషిప్‌లు అందజేయాలని నిర్ణయించింది.

News July 7, 2025

కాసేపట్లో ఐసెట్ ఫలితాలు.. Way2Newsలో వేగంగా..

image

TG: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్-2025 ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. జూన్ 8, 9 తేదీల్లో నిర్వహించిన పరీక్షలకు 71, 757 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 64,398 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఫలితాలను అందరికంటే ముందుగా Way2Newsలో వేగంగా, సులభంగా పొందవచ్చు. యాప్ ఓపెన్ చేయగానే కనిపించే స్క్రీన్‌పై హాల్‌టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే రిజల్ట్స్ కనిపిస్తాయి.

News July 7, 2025

అమరావతిలో 4 కన్వెన్షన్ సెంటర్‌ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

image

విజయవాడ: అమరావతిలో 4 కన్వెన్షన్ సెంటర్‌ల నిర్మాణానికి ఇటీవల జరిగిన CRDA 50వ అథారిటీ సమావేశంలో సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మందడం, తుళ్లూరు, లింగాయపాలెంలో ఒక్కోటి 2.5 ఎకరాలలో 4 ప్రాంతాలలో ఈ సెంటర్‌లు ఏర్పాటు కానున్నాయి. అమరావతిలో నిర్మించనున్న 5 నక్షత్రాల హోటళ్ల సమీపంలో QBS విధానంలో ఈ కన్వెన్షన్ సెంటర్‌లు నిర్మించనున్నట్లు తెలుస్తోంది.