News February 16, 2025
సంగారెడ్డి: రేపటి నుంచి ప్రాక్టీస్ పేపర్-2 పరీక్షలు

జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు రేపటి నుంచి 4 వరకు ప్రాక్టీస్ పేపర్-2 పరీక్షలను నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. ప్రాక్టీస్ పేపర్లకు సంబంధించిన ప్రశ్నా పత్రాలను మండల వనరుల కేంద్రాల సంగారెడ్డిలో ఈ నెల నుంచి 10వ తరగతి ప్రాక్టీస్ పేపర్-2 పరీక్షలు నుంచి తీసుకోవాలని సూచించారు.
Similar News
News January 2, 2026
నెల్లూరు జిల్లాలో 16 పీడీ యాక్టులు

నెల్లూరులో 2025లో గంజాయి బ్యాచ్కు ఓ వ్యక్తి బలయ్యాడు. అరుణ తర్వాత మరో లేడీ డాన్ కామాక్షి వెలుగులోకి వచ్చింది. వరుస నేరాలపై సీఎం చంద్రబాబు సైతం స్పందించారు. దీంతో పోలీసులు ఎక్కడిక్కడ రౌడీషీట్లు తెరిచారు. 3కంటే ఎక్కువ కేసులు ఉన్నవారిపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. 2025లో మొత్తం 16 మందిపై పీడీయాక్ట్, 34మందిపై గంజాయి కేసులు నమోదు చేసి 102 మందిని రిమాండ్కు పంపారు. 510 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
News January 2, 2026
ఓడీఎఫ్, ఎన్ఆర్ఈజీఎస్ లక్ష్యాల సాధనకు వేగం పెంచాలి: VZM కలెక్టర్

టెలికాన్ఫరెన్స్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులకు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శుక్రవారం దిశానిర్దేశం చేశారు. ఓడీఎఫ్, ఓడీఎఫ్ ప్లస్ పూర్తయిన గ్రామాలను వెంటనే డిక్లేర్ చేయాలని, ఇప్పటికే డిక్లేర్ చేసిన గ్రామాల్లో వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్ఆర్ఈజీఎస్ కింద రోజుకు 47 వేల మాన్డేస్ లక్ష్యాన్ని తప్పనిసరిగా సాధించాలన్నారు.
News January 2, 2026
గన్నవరం: ‘వంశీ ఎన్నికల అఫిడవిట్ను సమర్పించాలి’

వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్పై AP హైకోర్టు విచారణ చేపట్టింది. ఓ హత్యాయత్నం కేసులో దాఖలైన ఈ పిటిషన్పై వాదనలు జరిగాయి. వంశీపై 20 వరకు కేసులు ఉన్నాయని ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొన్నట్లు కోర్టుకు తెలిపింది. అయితే ఎన్నికలకు ముందు కేవలం 3 కేసులు మాత్రమే ఉన్నాయని వంశీ తరఫు న్యాయవాది వాదించారు. వాస్తవంగా ఎన్ని కేసులు ఉన్నాయన్న అంశంపై వంశీ తన ఎన్నికల అఫిడవిట్ను సమర్పించాలని ఆదేశించింది.


