News February 16, 2025
CT-2025.. భారత్ మ్యాచ్లకు ఎక్స్ట్రా టికెట్లు

భారత క్రికెట్ ఫ్యాన్స్కు ICC గుడ్ న్యూస్ చెప్పింది. CTలో భాగంగా దుబాయ్లో IND ఆడే గ్రూప్, తొలి సెమీస్ మ్యాచ్లకు అదనపు టికెట్లను ఇవాళ మధ్యాహ్నం నుంచే ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది. హైబ్రిడ్ విధానంలో CT జరుగుతున్నందున ఫైనల్ మ్యాచ్ టికెట్లు రిలీజ్ చేయలేదు. భారత్ ఫైనల్ చేరితే ఆ మ్యాచ్ దుబాయ్లో, లేకపోతే లాహోర్లో జరుగుతుంది. గ్రూప్ స్టేజీలో IND 20న బంగ్లాతో, 23న పాక్తో, మార్చి 2న NZతో తలపడనుంది.
Similar News
News November 9, 2025
ఎయిమ్స్ మంగళగిరిలో ఉద్యోగాలు

<
News November 9, 2025
అయ్యప్ప దీక్షతో ఆరోగ్యం కూడా..

అయ్యప్ప దీక్ష 41 రోజుల పాటు ఉంటుంది. కానీ, దీని ప్రభావం ఆ భక్తులపై ఎప్పటికీ ఉంటుంది. ఈ దీక్ష ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడమే కాక శారీరక, మానసిక ఆరోగ్యాన్నిస్తుంది. మెడలో రుద్రాక్ష, తులసి, చందనం, స్పటికం ధరించడం వలన ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. 41 రోజుల ఈ సామాన్య జీవనం దీక్షానంతరం ఆదర్శవంతమైన ఆరోగ్యకర అలవాటుగా మారుతుంది. శబరిలో స్వామి దర్శనంతో దీక్ష ముగుస్తుంది, కానీ ఆరోగ్య జీవనశైలి మాత్రం కొనసాగుతుంది.
News November 9, 2025
షట్డౌన్ ఎఫెక్ట్: 1,460 విమానాల రద్దు

అమెరికా ప్రభుత్వ షట్డౌన్ ఎఫెక్ట్ విమానయాన రంగంపై తీవ్రంగా పడింది. రెండో రోజు ఏకంగా 1,460 విమాన సర్వీసులను ఎయిర్ లైన్స్ రద్దు చేశాయి. మరో 6 వేలకు పైగా విమానాలు ఆలస్యమయ్యాయి. తొలి రోజు 1,025 విమానాలు రద్దు కాగా, 7 వేలకు పైగా డిలే అయ్యాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ భద్రతా సమస్యల కారణంగా 40 మేజర్ ఎయిర్ పోర్టుల్లో 4 శాతం డైలీ సర్వీసులను క్యాన్సిల్ చేయాలని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశించింది.


